ఇద్దరు అమ్మాయిలు పారిపోయి పెళ్లి చేసుకున్నారు

దాంతో పోలీసులు వారి కోసం వేట ప్రారంభించారు. ఇద్దరు అమ్మాయిలు కూడా పెళ్లి చేసుకున్న తర్వాత బీహార్లోని రోహతాస్ జిల్లాలో గల సాసారాంలోని ఓ హోటల్లో బస చేశారు. అక్కడ పోలీసులు వారిని గుర్తించి పట్టుకున్నారు.
మొబైల్ ఫోన్ లోకేషన్ ద్వారా వారిని పోలీసులు పట్టుకున్నారు. వారిని పాట్నాలోని కోర్టులో హాజరు పరిచారు. వారిద్దరు అక్టోబర్ 4వ తేదీన పారిపోయారు. సాసారాంలోని ఓ దేవాలయంలో ఇరువురు వివాహం చేసుకున్నారు.
అమ్మాయిలు ఇద్దురు కూడా బాల్య స్నేహితులు. కలిసి చదువుకున్నారు. దాంతో వారిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఈ అమ్మాయిల ఉదంతాన్ని పోలీసులు సోమవారంనాడు వెల్లడించారు.












Click it and Unblock the Notifications