సిబిఐ: ఇద్దరు గవర్నర్లు ఔట్, నరసింహన్ కూడా?

ఆగస్టా వెస్ట్ల్యాండ్ కుంభకోణం కేసులో సాక్షులుగా విచారణను ఎదుర్కున్న తర్వాత పశ్చిమ బెంగాల్ గవర్నర్గా ఎంకె నారాయణన్, గోవా గవర్నర్గా బివి వాంచూ రాజీనామాలు చేశారు. గత వారం సిబిఐ అధికారులు వారిద్దరినీ విచారించారు.
ఆంద్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ను బుధవారం సిబిఐ అధికారులు విచారించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. నరసింహన్ను కూడా సిబిఐ అధికారులు సాక్షిగా విచారించనున్నారు.
హెలికాప్టర్ల కొనుగోలు కోసం సంబంధించి అధికారులు సాంకేతికపరమైన వివరాలు తీసుకున్న సమయంలో నరసింహన్ ఇంటెలిజెన్స్ బ్యూరో అధిపతిగా ఉన్నారు. నారాయణన్ జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్నారు. అలాగే బీవీ వాంచూ స్పెషల్ ప్రొటెక్షన్ గార్డ్ హెడ్గా ఉన్నారు.












Click it and Unblock the Notifications