పోలీసు ఉన్నతాధికారుల కూతురిపై గ్యాంగ్రేప్
పోలీసు అధికారి కూతురిపైనే నలుగురు దుండగులు సాముహిక అత్యాచారినికి పాల్పడిన ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకొంది. భోపాల్లోని హబీబ్గంజ్ రైల్వే స్టేషన్ దగ్గర ఒక యవతిని నలుగురు వ్యక్తులు కిడ్నాప్
భోపాల్: పోలీసు అధికారి కూతురిపైనే నలుగురు దుండగులు సాముహిక అత్యాచారినికి పాల్పడిన ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకొంది. భోపాల్లోని హబీబ్గంజ్ రైల్వే స్టేషన్ దగ్గర ఒక యవతిని నలుగురు వ్యక్తులు కిడ్నాప్ చేసి మూడు గంటలపాటు అత్యాచారం చేశారు.
ఇదిలా ఉండగా బాధిత యువతి తల్లిదండ్రులు ఇద్దరూ పోలీసు ఉన్నతాధికారులుగా పనిచేస్తున్నారు. బాధిత యువతి ఎంపీ నగర్ ప్రాంతంలో సివిల్ సర్వీసెస్కు కోచింగ్ తీసుకుని ఇంటికి వస్తుండగా దుండగులు ఈ ఘటనకు ఒడిగట్టారు.
ఘాతుకానికి పాల్పడ్డ నలుగురు దుండగులను అదుపులోకి తీసుకున్నామని ప్రభుత్వ రైల్వే పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. ఈ ఘటన మంగళవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో జరిగిందని పోలీసులు గుర్తించారు.. అత్యాచారం చేస్తున్న సమయంలో బాధిత యువతి..తనపై ఘాతుకానికి పాల్పడవద్దని వారితో వేడుకుందని ఆయన చెప్పారు.
నలుగురు యువకులు అత్యాచారం చేసిన నలుగురు యువకులను గోలు, అమర్, గంటూ, రాజేష్ గుర్తించినట్లు హబీబ్గంజ్ పోలీసులు తెలిపారు. ఈ నలుగురిపై 376డీ, 34 సెక్షన్లపై కేసులు పెట్టినట్లు పోలీసులు తెలిపారు.