అధిరోహణలో అపశృతి : కాంచనగంగ శిఖరాన ఇద్దరు భారతీయుల మృతి
ఖాట్మండు : నేపాల్లోని కాంచనగంగ శిఖరాన్ని అధిరోహించే క్రమంలో ఇద్దరు భారతీయులు మృతిచెందారు. ప్రపంచంలో మూడో ఎత్తైన శిఖరం కాంచనను ఎక్కే సమయంలో 8 వేల మీటర్ల ఎత్తుల్లో చనిపోయినట్టు అక్కడ స్థానిక అధికారులు పేర్కొన్నారు. వారిద్దరూ విప్లవ్ వద్య (48), కుంటాల్ కర్నార్ (46)గా గుర్తించారు.
స్వస్థలం బెంగాల్ ..
కాంచన గంగ శిఖరాన్ని అధిరోహిస్తూ అంచు సమీపానికి బైద్య చేరుకున్నారని .. రేయనక, పగలనక పర్వతం అంచువైపు ప్రయాణం కొనసాగిందని పసంగ్ షెర్పా ఆఫ్ ది ప్రమోషన్ హైకింగ్ కంపెనీ తెలిపింది. తీవ్ర అస్వస్థతకు గురై బైద్య చనిపోయాడని వివరించింది. కర్నాల్ కూడా ఇదే విధంగా మరణించారని పేర్కొంది. వీరిద్దరూ పశ్చిమ బెంగాల్కు చెందిన వారని తెలిపారు.

మూడో ఎత్తైన శిఖరం ..
కాంచనగంగ పూర్తి ఎత్తు 8,586 మీటర్లు (28,169 అడుగులు) కాగా ... ప్రపంచంలో ఎత్తైన శిఖరాల్లో మూడవది. నేపాల్లోని హిమాలయాల్లో కాంచనగంగ శిఖరం ఉంది. అతి ఎత్తైన ఎవరెస్ట్ శిఖరం కూడా నేపాల్లోనే ఉంది.












Click it and Unblock the Notifications