బీజేపీకి షాక్, అప్ప ఇంట్లో మీటింగ్ లో సొంత పార్టీ ఎమ్మెల్యేలు డుమ్మా, అదే జరిగితే ?
బెంగళూరు: గతంలో కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలు మళ్లీ కాంగ్రెస్లో చేరనున్నారనే వార్తల నేపథ్యంలో బీజేపీ సీనియర్ నేత, మాజీ సీఎం బీఎస్. యడ్యూరప్ప ఇంట్లో బీజేపీ ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఇద్దరు ఎమ్మెల్యేలు హాజరుకాకపోవడం ఇప్పుడు పలు అనుమానాలకు తావిస్తోంది.
కాంగ్రెస్ హస్తం ఆపరేషన్లో కొందరు అసంతృప్త బీజేపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారనే అనుమానంతో బీజేపీ సీనియర్ లీడర్ బీఎస్ యడ్యూరప్ప స్వయంగా రంగంలోకి దిగారు. కర్ణాటక మాజీ సీఎం బసవరాజ్ బోమ్మయ్, మాజీ డీసీఎం ఆర్. అశోక సహా పలువురు నేతలతో యడియూరప్ప ఇంటిలో సమావేశం నిర్వహించి బీజేపీ ఎమ్మెల్యేలు అందరిని ఆహ్వానించారు.

యడ్యూరప్ప నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి మాజీ ముఖ్యమంత్రులు బసవరాజ్ బోమ్మయ్, డీవీ. సదానంద గౌడ, సీనియర్ ఎమ్మెల్యే ఆర్.అశోక, బీజేపీ ఎమ్మెల్యేలుహాజరయ్యారు. 2019 రాజకీయ సంక్షోభం సమయంలో పార్టీ ఫిరాయించిన వారితో సహా బీజేపీ, జేడీఎస్ ఎమ్మెల్యేలను తమ పార్టీ ఆకర్షించే అవకాశం ఉందని కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి డీకే. శివకుమార్ ఇదే వారంలో సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఎస్ టీ. సోమశేఖర్, బైరతీ బసవరాజ్, కే. గోపాలయ్య, మునిరత్న, శివరామ్ హెబ్బార్లు బీజేపీ నుంచి కాంగ్రెస్ కు జంప్ అవుతున్నారని ప్రచారం జరుగుతున్న సమయంలో వారి మీద బీజేపీ ప్రత్యేక దృష్టి సారిస్తోంది. పార్టీ ఫిరాయించి 2019లో బీజేపీ అధికారంలోకి రావడానికి సహకరించిన 17 మంది ఎమ్మెల్యేల్లో వీరు కూడా ఉన్నారు.
అసంతృప్త ఎమ్మెల్యేలు బీజేపీకి ఎలా దూరమయ్యారో ఈ సమావేశంలో తేలింది. 17 మంది ఫిరాయింపుదారులలో 16 మంది కర్ణాటకలో బీజేపీలో అత్యంత సీనియర్ నాయకుడు అయిన యడ్యూరప్పను నమ్మి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి అప్పట్లో బీజేపీలో చేరారు. తరువాత యడియూరప్పను సీఎం చేసిన రెబల్ ఎమ్మెల్యేలు తరువాత మంత్రులు అయ్యారు.

గతంలో కాంగ్రెస్లో ఉన్న సోమశేఖర్ తన యశ్వంత్పూర్ నియోజకవర్గానికి చెందిన స్థానిక బీజేపీ నేతలపై అసంతృప్తితో ఉన్నారని బహిరంగంగానే చెప్పారు. దీనికి ముందు మాజీ సీఎం బసవరాజ్ బోమ్మయ్ ని కలుసుకుని ఇదే విషయం గురించి మాట్లాడారు. అయితే యడ్యూరప్ప నివాసంలో జరిగిన సమావేశానికి ఎస్ టీ, సోమశేఖర్ తో పాటు కేఆర్ పురం ఎమ్మెల్యే బైరతి బసవరాజ్ కూడా హాజరు కాలేదు.
ఇప్పుడు బీజేపీ నాయకుల్లో గుబులు మొదలైయ్యింది. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు త్వరలో కాంగ్రెస్ లో చేరిపోతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే బీజేపీ సీనియర్ నాయకులు ఇద్దరు ఎమ్మెల్యేలతో చర్చలు జరుపుతున్నారని తెలిసింది. మొత్తం మీద బీజేపీ ఎమ్మెల్యేల్లో సీనియర్ అధికారుల తీరుతో కొందరు విసిగిపోతున్నారని తెలిసింది.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications