రెండు వారాళ్లో పెళ్లి, బాత్ రూమ్ లో పెళ్లికూతురు ఏం చేసిందంటే ?, పెళ్లికొడుకు మైండ్ బ్లాక్ !
డిగ్రీ పూర్తి చేసిన యువతి పీజీ చెయ్యాలని ఆమె కుటుంబ సభ్యులకు చెప్పింది. పీజీ పూర్తి చేసిన తరువాత తాను మంచి ఉద్యోగం చేస్తానని, అప్పుడు మంచి పెళ్లి సంబంధాలు వస్తాయని యువతి కుటుంబ సభ్యులకు నచ్చచెప్పింది. పీజీ పూర్తి చేసిన యువతి ఉద్యోగం చేస్తున్నది. అయితే యువతికి హడావిడిగా పెళ్లి చెయ్యడానికి పెద్దలు అన్ని ఏర్పాటు చేశారు. పెళ్లికి రెండు వారాల ముందు ఆ యువతి బాత్ రూమ్ లో శవమై కనిపించింది.
పెళ్లికి 13 రోజుల ముందు ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా తీర్థహళ్లి తాలూకా కట్టెహక్లు గ్రామంలో చోటుచేసుకుంది. చైత్రా (26) అనే యువతి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు హడలిపోయారు. చైత్రా మృతదేహం ఆమె ఇంట్లోని బాత్రూమ్లో వేలాడుతూ కనిపించింది.

మృతురాలు చైత్రా వివాహం వచ్చే నెల ఫిబ్రవరి 4వ తేదీన జరగాల్సి ఉంది.
అయితే అకస్మాత్తుగా చైత్రా మృతి చెందింది. చైత్రా ఆత్మహత్యకు కచ్చితమైన కారణాలు తెలియడం లేదని పోలీసులు అంటున్నారు. కుటుంబ సభ్యులు చైత్రా పెళ్లి నిశ్చయించారు. అయితే తాను పెళ్లి చేసుకోనని చైత్రా ఆమె కుటుంబ సభ్యులకు అభ్యంతరం చెప్పింది. అయితే కుటుంబీకులు చైత్రాను పెళ్లికి ఒప్పించి పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఇప్పటికే నిశ్చితార్థం జరిగిపోవడంతో చైత్రా పెళ్లికి డేట్ కూడా ఫిక్స్ చేశారు.
తనకు పెళ్లి ఇష్టం లేదని, నాకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, అందుకే తాను పెళ్లి చేసుకోనని చైత్రా ఆమె తల్లిదండ్రులకు పదేపదే చెప్పినా వాళ్లు పట్టించుకోలేదని తెలిసింది. తను ఎందుకు పెళ్లి చేస్తున్నారు అంటూ చైత్రా ఆమె తల్లిని ఇటీవల నిలదీసిందని తెలిసింది. అయినా పెళ్లికి చకచకా పనులు చేస్తుండటంతో జీవితంపై వరక్తి పెంచుకున్న చైత్రా ఆత్మహత్య చేసుకుని ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చైత్రా ఎం.కామ్ పూర్తి చేసింది. కట్టెహక్లాలోని రామకృష్ణ మెడికల్స్ లో చైత్రా ఉద్యోగం చేస్తోంది. తీర్థహళ్లి పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించి విచారణ చేపట్టారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications