ఉడిపి స్వామీజీ మృతి కేసు: మఠంలో మద్యం, కాండోమ్ లు, సీసీ కెమెరా డీవీఆర్ సీజ్!
బెంగళూరు: ఉడిపి శిరూరు మఠం శ్రీ లక్ష్మివర తీర్థ స్వామీజీ అనుమానాస్పద మృతి కేసు కొత్త మలుపు తిరుగుతోంది. మఠంలో పోలీసులు సోదాలు ముమ్మరం చేశారు. ఉడిపి జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో 7 ప్రత్యేక బృందాలు విచారణ ముమ్మరం చేశాయి. అనుమానంతో పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. మఠంలో మాయం అయిన సీసీ కెమెరాల డీవీఆర్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఎక్కడస్వామీజీ ప్రత్యేక గది
శిరూరు మఠంలో శ్రీ లక్ష్మివర తీర్థ స్వామీజీకి ప్రత్యేక గది ఉంది. ఆ గదిలోకి స్వామీజీ మినహా ఎవ్వరూ లోపలికి వెళ్లరు. మఠంలోని సిబ్బందిని వెంట పెట్టుకుని పోలీసులు స్వామీజీ గదిలో సోదాలు చేస్తున్నారు. స్వామీజీ గదిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

మద్యం, కాండోమ్ లు
మఠంలోని శ్రీ లక్ష్మీవర తీర్థ స్వామీజీ గదిలో పోలీసులు భారీగా మద్యం బాటిళ్లు, కాండోమ్ లు, శానిటరీ ప్యాడ్లు స్వాధీనం చేసుకున్నారని తెలిసింది. మఠం ఆవరణంలోని బావిలో ఖాళీ మద్యం బాటిళ్లు స్వాదీనం చేసుకున్నారు. బావిలో ఉన్న వస్తువులు అన్నీ బయటకు తీయ్యడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

మహిళ కుమారుడు
శిరూరు మఠం శ్రీ లక్ష్మివర తీర్థ స్వామీజీ అనారోగ్యంతో మరణించలేదని, హత్య చేసి ఉంటారనే ప్రచారానికి బలం చేకూరుతోంది. స్వామీజీకి చాల సన్నిహితంగా ఉంటున్న మహిళ కుమారుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.

డీవీఆర్ స్వాధీనం
శిరూరు మఠంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల డీవీఆర్ చోరీ అయిన విషయం తెలిసిందే. స్వామీజీకి పరిచయం ఉన్న మహిళ కుమారుడు తన స్నేహితులతో కలిసి డీవీఆర్ ను చోరీ చేసినట్లు పోలీసుల విచారణలో అంగీకరించాడని సమాచారం. మహిళ కుమారుడితో సహ ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.

స్వామీజీ కొడుకు ?
తనకు పిల్లలు ఉన్నారని గతంలో శ్రీ లక్ష్మీవర తీర్థ స్వామీజీ బహిరంగంగా చెప్పారు. స్వామీజీకి పరిచయం ఉన్న మహిళ కుమారుడే స్వామీజీ కుమారుడా ? అనే అనుమానాలు ఇప్పుడు మొదలైనాయి. స్వామీజీకి మహిళకు ఉన్న సంబంధం ఏమిటీ, ఆమె కుమారుడు డీవీఆర్ ఎందుకు చోరీ చేశాడు, బుర్కా వేసుకుని రమ్యా శెట్టి ఎందుకు పారిపోవడానికి ప్రయత్నించింది అని పోలీసులు ఆరా తీస్తున్నారు.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications