రాజకీయ స్ఫూర్తి ప్రదాతకు కిషన్ రెడ్డి పాదాభివందనం: బీజేపీ కురువృద్ధుడికి సన్మానం
న్యూఢిల్లీ: కేంద్ర హోమ్శాఖ సహాయ మంత్రి జీ కిషన్ రెడ్డి భారతీయ జనతాపార్టీ కురువృద్ధుడు లాల్ కృష్ణ అద్వానీని మర్యాదపూరకంగా కలుసుకున్నారు. ఆయనకు పాదాభివందనం చేశారు. శాలువా కప్పి సన్మానించారు. గౌరవసూచకంగా పుష్పగుచ్ఛాన్ని అందించారు. పరిపాలనలో తనకు మెళకువలు సూచించాలని కోరారు.
కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలను స్వీకరించిన మరుసటి రోజు ఆయన న్యూఢిల్లీలోని ఎల్ కే అద్వానీ నివాసానికి వెళ్లారు. అద్వాని కలుసుకుని, పాదాభివందనం చేశారు. సుమారు అరగంట పాటు అక్కడే గడిపారు. అద్వానీని స్ఫూర్తిగా తీసుకుని తాను రాజకీయాల్లోకి ప్రవేశించినట్లు ఈ సందర్భంగా కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు. గతంలో ఆయన చేపట్టిన రథయాత్ర తనలో ఉద్యమ స్ఫూర్తిని రగిలించిందని అన్నారు.

దేశ రాజకీయాల్లో అత్యంత సీనియర్ అద్వానీని సన్మానించడం తనకు గర్వకారణంగా ఉందని అన్నారు. ఓ సాధారణ కార్యకర్తగా ఉన్న తనను కేంద్ర మంత్రిని చేసిన ఘనత బీజేపీదేనని అన్నారు. కేంద్రమంత్రి హోదాలో అద్వానీ నివాసానికి వెళ్లడం తనకు చిరస్మరణీయమైన అనుభూతిని మిగిల్చిందని కిషన్ రెడ్డి చెప్పారు.

-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications