Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బంపర్ ఆఫర్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం, ప్రతిపక్ష పార్టీకి మైండ్ బ్లాక్, ఆ రాష్ట్రానికి !

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలపై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్న మోదీ ప్రభుత్వం వరాల జల్లులు కురిపిస్తున్నది. అందులో భాగంగా కర్ణాటక రాష్ట్రానికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ భారీ మొత్తంలో నిధులు విడుదల చేశారు.

కర్ణాటక రాష్ట్రంలో రవాణా రంగంలో అభివృద్ధి విప్లవం చోటుచేసుకుంటోంది. రైల్వే, మెట్రో, రోడ్లతో సహా ఇతర రంగాల్లో అభివృద్ధికి కేంద్రం పెద్దపీట వేసింది. సెంట్రల్ రోడ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కింద కర్ణాటక రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో రోడ్ల అభివృద్ధి ప్రాజెక్టులకు ఏకంగా రూ. 1,385. 50 కోట్లు మంజూరు చేసినట్లు కేంద్ర రహదారులు, భూ రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.

Union Minister Nitin Gadkari has allocated a huge amount of funds to the state of Karnataka

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఒక ట్వీట్‌ చేసి అందులో వివరాలు తెలిపారు. 2,055.62 కి.మీ. పనుల కోసం ఈ డబ్బును కేటాయించామని వివరించారు. 295 పొడవైన రోడ్ల అభివృద్ధి, పటిష్టతకు ఈ నిధులు వినియోగిస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా కర్ణాటక రాష్ట్రంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తుంది. రోడ్ల కనెక్టివిటీని పెంచడం ద్వారా, ఇది ఆర్థికాభివృద్ధికి దారితీస్తుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వివరించారు.

హాసన్‌ జిల్లాలో 22.3 కిలోమీటర్ల మేర ఎన్‌హెచ్‌-373లో నాలుగు లైన్ల పనుల కోసం నుంచి రూ. 576.22 కోట్లు మంజూరు చేసినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. చిక్కమగళూరు, బేలూరు, హళేబీడు, శ్రావణబెళగొళ వంటి ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలకు ప్రధాన లింక్‌గా ఈ కారిడార్ పనిచేస్తుంది. ఈ ప్రాజెక్టు అమలు వల్ల కనెక్టివిటీ పెరుగుతుందని, టూరిజం వృద్ధికి దోహదపడుతుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు.

Union Minister Nitin Gadkari has allocated a huge amount of funds to the state of Karnataka

ఇటీవల మైసూరులోని మహారాజా కళాశాల మైదానంలో జరిగిన 22 జాతీయ రహదారుల పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడారు. 2024 చివరి నాటికి కర్ణాటక రాష్ట్ర రహదారుల రూపురేఖలు మారిపోయి అమెరికా రోడ్ల మాదిరిగా తయారు అవుతాయని అన్నారు. మైసూరు, హాసన్‌లకు రింగ్‌ రోడ్డు వేస్తామని, బెంగళూరు-చెన్నై నగరాల మధ్య రూ 20 వేల కోట్ల రూపాయల వ్యయంతో రహదారులు నిర్మిస్తామని, బెంగళూరు నుంచి చెన్నైకి కేవలం 2 గంటల్లో చేరుకునేలా ఆ రహదారులు తీర్చిదిద్దుతామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+