ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో కాశ్మీర్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు (ఫోటోలు)
న్యూఢిల్లీ: సోమవారం ప్రధాని నరేంద్రమోడీ కాశ్మీర్ రాజధాని శ్రీనగర్లో పర్యటించనున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. కాశ్మీర్లో రెండు రోజుల క్రితం వేర్వేరు చోట్ల ఉగ్రవాదుల దాడులు జరగడంతో భద్రతా సిబ్బంది ఏర్పాట్లపై మరింత దృష్టి పెట్టారు.
రహదారులపైకి భారీ స్ధాయిలో భద్రతా బలగాలను తరలించారు. చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వాహనదారులను, పాదచారులను ఎవరినీ వదలకుండా తనిఖీలు చేస్తున్నారు. శ్రీనగర్ పరిసర ప్రాంతాల్లో ఇటీవల కాలంలో ఇంత భారీ స్ధాయిలో భద్రత ఏర్పాట్లు చేయలేదని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
ఇందుకోసం పెద్ద ఎత్తున పారామిలిటరీ దళాలను పెద్ద ఎత్తున దింపారు. ప్రధానిగా మోడీ బాధ్యతలు చేపట్టిన తర్వాత కాశ్మీర్లో మొదటిసారి బహిరంగ సభలో ప్రసంగిస్తున్నారు. మోడీ సభ జరగనున్న షేర్ ఈ కాశ్మీర్ క్రికెట్ స్టేడియం చుట్టుపక్కల ఉన్న భవంతులపై షార్ప్ షూటర్స్ను ఏర్పాటు చేస్తున్నారు.
స్టేడియం నిండా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు... సభకు వచ్చే వారి కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు సిబ్బందిని నియమించారు. ఈ సభకు సుమారుగా లక్ష మంది వరకు హాజరవుతారని బీజేపీ అంచనా వేసింది.
కాశ్మీర్లోని యూరీ సైనిక శిబిరంపై జరిగిన ఉగ్రవాద దాడిలో చనిపోయిన ఉగ్రవాదుల మృత దేహాల నుంచి స్వాధీనం చేసుకున్న ఆహార పొట్లాలపై పాక్కు సంబంధించిన గుర్తులు ఉన్నాయని సైనికాధికారి ఒకరు తెలిపారు.
కాశ్మీర్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
సోమవారం ప్రధాని నరేంద్రమోడీ కాశ్మీర్ రాజధాని శ్రీనగర్లో పర్యటించనున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. కాశ్మీర్లో రెండు రోజుల క్రితం వేర్వేరు చోట్ల ఉగ్రవాదుల దాడులు జరగడంతో భద్రతా సిబ్బంది ఏర్పాట్లపై మరింత దృష్టి పెట్టారు.
కాశ్మీర్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
రహదారులపైకి భారీ స్ధాయిలో భద్రతా బలగాలను తరలించారు. చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వాహనదారులను, పాదచారులను ఎవరినీ వదలకుండా తనిఖీలు చేస్తున్నారు. శ్రీనగర్ పరిసర ప్రాంతాల్లో ఇటీవల కాలంలో ఇంత భారీ స్ధాయిలో భద్రత ఏర్పాట్లు చేయలేదని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
కాశ్మీర్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
ఇందుకోసం పెద్ద ఎత్తున పారామిలిటరీ దళాలను పెద్ద ఎత్తున దింపారు. ప్రధానిగా మోడీ బాధ్యతలు చేపట్టిన తర్వాత కాశ్మీర్లో మొదటిసారి బహిరంగ సభలో ప్రసంగిస్తున్నారు. మోడీ సభ జరగనున్న షేర్ ఈ కాశ్మీర్ క్రికెట్ స్టేడియం చుట్టుపక్కల ఉన్న భవంతులపై షార్ప్ షూటర్స్ను ఏర్పాటు చేస్తున్నారు.
కాశ్మీర్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
స్టేడియం నిండా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు... సభకు వచ్చే వారి కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు సిబ్బందిని నియమించారు. ఈ సభకు సుమారుగా లక్ష మంది వరకు హాజరవుతారని బీజేపీ అంచనా వేసింది.
కాశ్మీర్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
హతులైన ఉగ్రవాదుల నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సైనికాధికారి మాట్లాడుతూ ఆహార పొట్లాలతో పాటు భారీగా కలిగి ఉన్న ఆయుధాలను బట్టి చూస్తే భారత్ సైన్యంతో ఎక్కువ రోజులు పోరాడాలన్నది వారి ఉద్దేశ్యంగా కనబడతోందన్నారు.
కాశ్మీర్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
కాశ్మీర్లోని యూరీ సైనిక శిబిరంపై జరిగిన ఉగ్రవాద దాడిలో చనిపోయిన ఉగ్రవాదుల మృత దేహాల నుంచి స్వాధీనం చేసుకున్న ఆహార పొట్లాలపై పాక్కు సంబంధించిన గుర్తులు ఉన్నాయని సైనికాధికారి ఒకరు తెలిపారు.
హతులైన ఉగ్రవాదుల నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సైనికాధికారి మాట్లాడుతూ ఆహార పొట్లాలతో పాటు భారీగా కలిగి ఉన్న ఆయుధాలను బట్టి చూస్తే భారత్ సైన్యంతో ఎక్కువ రోజులు పోరాడాలన్నది వారి ఉద్దేశ్యంగా కనబడతోందన్నారు.