యూపీలో కొనసాగుతోన్న ఆఖరి విడత పోలింగ్..
చివరి విడత పోలింగ్ లో 1,41,88,233 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు.
లక్నో: యూపీలో ఆఖరి విడత పోలింగ్ కొనసాగుతోంది. రాష్ట్రంలోని ఏడు జిల్లా పరిధిలో ఉన్న 40నియోజకవర్గాల్లో నేటి ఉదయం నుంచి పోలింగ్ ప్రారంభమైంది. ఈ పోలింగ్ లో 1,41,88,233 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు.
40నియోజకవర్గాల పరిధిలో మొత్తం 238మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో 139మంది అభ్యర్థులు స్వతంత్రులే కావడం గమనార్హం. ఆఖరి విడత పోలింగ్ కావడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఆఖరి విడత ఎన్నికల్లో మాజీ మంత్రి ఓంప్రకాశ్, మాజీ ఎంపీ అజయ్ రాయ్, మాఫియా లీడర్ మున్నా బజ్రంగి భార్య సీమా సింగ్ వంటి నేతలు బరిలో ఉన్నారు.
మణిపూర్ లో రెండో దశ ఎన్నికలు:
మణిపూర్ లో రెండో దశ పోలింగ్ కొనసాగుతోంది. 22నియోజకవర్గాల్లో 7.80లక్షల మంది ఓటర్లు 98మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చనున్నారు. కాగా, ఎన్నికల ఫలితాలు












Click it and Unblock the Notifications