పోలీసుల్ని చంపేస్తే ఈ మానవహక్కులేవి, నేతాజీ అంశం షాక్: వెంకయ్య
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఎన్కౌంటర్ల పైన మానవ హక్కుల సంఘం నిరసనలు, మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యల పైన కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఘాటుగా స్పందించారు. గతంలో ఎర్రచందనం దొంగలు, స్మగ్లర్లు పోలీసులను, అటవీ శాఖ అధికారులను చంపేసినప్పుడు ఇప్పుడు మాట్లాడుతున్న మానవ హక్కుల సంఘాల నేతలు, మజ్లిస్ నేతలు అప్పుడెందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు.
మానవ హక్కుల సంఘాలకు ద్వంద్వ ప్రమాణాలు తగదన్నారు. పోలీసులు చనిపోయినప్పుడు నోరెత్తని వారు, ఇప్పుడు ఉగ్రవాదులు, స్మగ్లర్లు కోసం మానవ హక్కులు అంటూ గొంతు చించుకోవడం సిగ్గుచేటు అన్నారు. సిమి ఉగ్రవాదులు పోలీసులను బలిగొన్నప్పుడు ఎందుకు నోరు మెదపలేదన్నారు. పోలీసుల కుటుంబాలకు కనీసం సానుభూతి తెలపలేదన్నారు.

సుభాష్ చంద్రబోస్ కుటుంబం పైన ఇరవయ్యేళ్ల పాటు నిఘా దారుణమని వెంకయ్య అన్నారు. దీనిపై సమగ్ర దర్యాఫ్తు జరిపి అన్ని విషయాలను ప్రజల ముందు ఉంచుతామని చెప్పారు. దేశం గర్వించదగ్గ మహా నాయకుడు నేతాజీ అన్నారు.
అలాంటి నాయకుడి కుటుంబంపై నిఘా పెట్టారని తెలియడం దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటన నుండి వచ్చాక దీనిపై మాట్లాడుతామని చెప్పారు. ఈ నిఘా ఏ ప్రభుత్వం హయాంలో జరిగింది, దీనికి బాధ్యులెవరో బయటపెడతామన్నారు.
-
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!!












Click it and Unblock the Notifications