డుమ్మా: ఈడికి మాల్యా మూడోసారి టోకరా
న్యూఢిల్లీ: లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా మూడోసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడి)కి టోకరా ఇచ్చారు. శనివారం నాడు మూడోసారి ఆయన ఈడి ముందు గైర్హాజరయ్యారు. మనీ లాండరింగ్ కేసులో తనకు మే వరకు సమయం ఇవ్వాలని ఆయన ఈడిని కోరారు.
విజయ్ మాల్యా 900 కోట్ల రూపాయల రుణ కుంభకోణంలో చిక్కుకున్న వ్యవహారంపై ఈడి విచారణ జరుపుతోంది. తమ ముందు ఏప్రిల్ 9వ తేదీన హాజరు కావాలని ఈడి మూడో సారి ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఇంతకు ముందు రెండు సార్లు కూడా ఆయన ఈడి ముందు హాజరు కాలేదు.

తొలుత మార్చి 18వ తేదీన, రెండోసారి ఏప్రిల్ 2వ తేదీన ఆయన ఈడి ముందు హాజరు కావాల్సి ఉండింది. సుప్రీంకోర్టులో నడుస్తున్న న్యాయపరమైన వ్యవహారం వల్ల తాను వ్యక్తిగత తాను హాజరు కాలేకపోతున్నట్లు ఆయన ఈడి దర్యాప్తు అధికారికి తెలిపారు.
మే వరకు తనకు సమయం ఇవ్వాలని ఇంతకు ముందు కూడా మాల్యా విజ్ఞప్తి చేశారు. అయితే ఆ విజ్ఞప్తిని ఈడి తోసి పుచ్చింది. ఆయనపై న్యాయపరమైన చర్యలు తీసువాలా, హాజరుకు మరింత సమయం ఇవ్వాలా అనే విషయంపై ఈడి సోమవారం నిర్ణయం తీసుకుంటుంది. అయితే, ఏప్రిల్ 9వ తేదీయే ఆయనకు ఇచ్చే గడవు అని ఇంతకు ముందు ఈడి అధికారులు చెప్పారు.
-
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..?












Click it and Unblock the Notifications