గోవా: విశ్వజిత్ రాణే లీడ్, భార్య కూడా.. పోలింగ్ కేంద్రం నుంచి వస్తూ ఆనందం, సీఎం అంటూ..
5 రాష్ట్రాల ఎన్నికల్లో కమలం వికసించింది. ఒక పంజాబ్ మినహా మిగతా చోట్ల బీజేపీ ప్రభుత్వాలే కొలువుదీరనున్నాయి. ఈ క్రమంలో బీజేపీ నేత, మంత్రి విశ్వజిత్ రాణే వాలిపొయి నియోజకవర్గంలో గల పోలింగ్ స్టేషన్ సందర్శించారు. ఎర్లీ ట్రెండ్ చూసి అతను సంభ్రమశ్చర్యాలకు గురయ్యారు. అతను చూసే సమయానికి 7 వేల ఓట్ల లీడ్లో ఉన్నారు. అక్కడినుంచి ఆనందభాష్పాలతో వెనుదిరిగారు.
అభ్యర్థుల విజయం కానీ, తమ పార్టీ తిరిగి అధికారంలోకి రావడానికి ప్రధాని మోడీ కారణం అని చెప్పారు. గోవా కోసం మోడీ ఎంతో చేశారని పేర్కొన్నారు. ఇదీ ప్రజల విజయం అని తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం బీజేపీ పనిచేసింది.. పనిచేస్తోందని వివరించారు. కాంగ్రెస్, ఇతర పార్టీలు అయితే ప్రజలను మోసం చేశాయని తెలిపారు. పోలింగ్ కేంద్రం నుంచి వెళుతూ మీడియాతో మాట్లాడుతుండగా.. అతనిని సీఎం చేయాలని మద్దతుదారులు నినాదాలు చేశారు. ఇదీ ప్రాధాన్యం సంతరించుకుంది. గోవా సీఎంగా ప్రమోద్ సావంత్ కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. మనోహర్ పారికర్ మరణం తర్వాత.. సావంత్ పగ్గాలు చేపట్టారు.

మహిళా సాధికారత కోసం తమ ప్రభుత్వం పనిచేసిందని రాణే వివరించారు. రహదారుల నిర్మాణం, మౌలిక వసతుల సదుపాయాల కల్పన చేపట్టిందని తెలిపారు. అలాగే అతని భార్య ప్రాతినిధ్యం వహిస్తోన్న పొరియం నియోజకవర్గం ట్రెండ్స్ గురించి సహచరులు తెలియజేశారు. ఆమె 13 వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
గోవాలో మొత్తం 40 స్థానాలు ఉండగా.. 17 చోట్ల బీజేపీలో లీడ్లో ఉంది. మరో 4 సీట్లలో లీడ్ కొనసాగితే.. బీజేపీ అధికారం ఖాయం. కాంగ్రెస్ పార్టీ 11 చోట్ల లీడ్లో ఉంది.
-
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!!












Click it and Unblock the Notifications