ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్
ఏడు రాష్ట్రాల్లో 59 లోక్సభ నియోజకవర్గాల్లో ఆరో విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ స్టేషన్ల వద్ద క్యూలు కట్టారు. మాక్ పోలింగ్ నిర్వహించిన అనంతరం పోలింగ్ సిబ్బంది ఉ.7గంటల నుంచి ఓటు వేసేందుకు అనుమతిస్తున్నారు. భోపాల్ బీజేపీ అభ్యర్థి సాధ్వీ ప్రగ్యా సింగ్ ఠాకూర్ క్యూలో నిలబడి ఓటు వేశారు. ప్రతి ఒక్కరూ ఓటుహక్కు వినియోగించుకోవాలని అభ్యర్థించారు.
ఆరోదశలో ఓటర్లు 979 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేస్తున్నారు. ఈ దఫా పోలింగ్ జరగనున్న నియోజకవర్గాల్లో పలువురు కేంద్రమంత్రులు ఉన్నారు. ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఎలక్షన్ కమిషన్ భద్రత కట్టుదిట్టం చేసింది. ముఖ్యంగా బెంగాల్లో ప్రతి పోలింగ్ బూత్ వద్ద కేంద్ర బలగాలతో పహరా ఏర్పాటుచేశారు.













Click it and Unblock the Notifications