కేరళలో కమ్యూనిజం బతికే ఉంది: వాషింగ్టన్ పోస్ట్ కథనం
కేరళలో ఇంకా కమ్యూనిజం బతికే ఉందని, దేశంలో తొలిసారిగా ఎన్నికల ద్వారా ఇదే రాష్ట్రంలో అధికారాన్ని కమ్యూనిష్టు పార్టీ అధికారాన్ని సాధించిన విషయాన్ని వాషింగ్టన్ పోస్ట్ ప్రచురించింది.
వాషింగ్టన్ :కేరళలో ఇంకా కమ్యూనిజం బతికే ఉందని, దేశంలో తొలిసారిగా ఎన్నికల ద్వారా ఇదే రాష్ట్రంలో అధికారాన్ని కమ్యూనిష్టు పార్టీ అధికారాన్ని సాధించిన విషయాన్ని వాషింగ్టన్ పోస్ట్ ప్రచురించింది.
ఇండియాలో కేరళ రాష్ట్రంలో కమ్యూనిష్టు పార్టీ ఏ రకంగా పాలన సాగిస్తుంది. ఆ రాష్ట్రంలో కమ్యూనిష్టు పాలన సాగడానికి గల కారణాలను ఆ పత్రిక ప్రముఖంగా ప్రచురించింది.

కేరళలో ప్రస్తుతం సిపిఎం నేతృత్వంలో లెఫ్ట్ఫ్రంట్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ గుర్తింపు ఉన్న పత్రిక వాషింగ్టన్ పోస్ట్ ఆదివారం తమ సంచికలో కేరళ రాష్ట్రంలో కమ్యూనిష్టు ప్రభుత్వం అధికారంలో ఉన్న విషయమై ఓ వ్యాసాన్ని ప్రచురించింది. ఏ కమ్యూనిస్ట్ సక్సెస్ పేరుతో భారతదేశంలో ఓ చిన్న రాష్ట్రంలో కమ్యూనిజం ఇంకా బతికే ఉందని.. కలలు సాకారం చేసుకునేందుకు అక్కడ కృషి జరుగుతోందంటూ కథనాన్ని ప్రచురించింది.
ప్రముఖ పాత్రికేయులు గ్రెగ్ జఫ్ఫె, విది దోషి.. ఈ ప్రత్యేక కథనాన్ని రచించారు. కేరళ ఆర్థిక మంత్రి థామస్ ఐసాక్ ఇంటర్వ్యూతోపాటు పలు అంశాలను కూడా అందులో ప్రస్తావించారు. వామపక్ష సిద్ధాంతాలను ప్రజలు విస్తృతంగా ఆదరించటం మూలంగానే కేరళలో ఇంకా కమ్యూనిస్ట్ పార్టీ విరజిల్లుతోందంటూ థామస్ అందులో వివరించారు. కేరళలో వామపక్ష ప్రభుత్వ హయాంలో సాధించిన ఘనతలను కూడా ఆ కథనం విపులంగా వివరించింది.
అమెరికా ప్రధాన వార్తలను సైతం పక్కన పడేసిన ఈ స్టోరీపై పాఠకులు దృష్టిసారించటం విశేషం. ఇదిలా ఉంటే కేరళ పర్యటన సందర్భంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కూడా అన్ని రంగాల్లో కేరళ అభివృద్ధి చెందిందని.. గ్లోబల్ ఫేస్ అంటూ ప్రశంసలు కురిపించారు.
-
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్..












Click it and Unblock the Notifications