60 మంది ఎమ్మెల్యేలు, 8 మంది మంత్రులు మాకే మద్దతు: బాంబు పేల్చిన మన్నార్ గుడి !
తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు త్వరలోనే సినిమా చూపిస్తామాని, అంత సామాన్యంగా వదిలిపెట్టమని మన్నార్ గుడి మాఫియా హెచ్చరించింది.
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు త్వరలోనే సినిమా చూపిస్తామాని, అంత సామాన్యంగా వదిలిపెట్టమని మన్నార్ గుడి మాఫియా హెచ్చరించింది. రెండు రోజుల్లో మా వైపు ఎంత మంది ఎమ్మెల్యేలు ఉన్నారో అందరికీ తెలుస్తోందని మన్నార్ గుడి మాఫియా చెప్పింది.
వీకే శశికళ నటరాజన్ సోదరుడు దివాకరన్ శనివారం మీడియాతో మాట్లాడుతూ దినకరన్ వైపు 60 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పారు. తమిళనాడు ప్రభుత్వంలోని 8 మంది మంత్రులు సైతం దినకరన్ కు మద్దతు ఇవ్వడానికి సిద్దంగా ఉన్నారని అన్నారు.

తమిళనాడు ప్రభుత్వంలో మాకు మద్దతు ఇచ్చే మంత్రుల పేర్లు మాత్రం బయటకు చెప్పమని దివాకరన్ వివరించారు. ఎడప్పాడి పళనిసామి శాసన సభలో బలపరీక్ష నిరూపించుకునే సమయంలో ఆ మంత్రులు ఆయనకు వ్యతిరేకంగా ఓటు వెయ్యడానికి సిద్దంగా ఉన్నారని దివాకరన్ బాంబు పేల్చారు.
శశికళకు అనుకూలంగా మంత్రులు ఎవరెవరు ఉన్నారు అంటూ ఎడప్పాడి పళనిసామి, పన్నీర్ సెల్వం ఆరా తీస్తున్నారు. శశికళకు అనుకూలంగా ముగ్గురు మంత్రులు ఉన్నారు. అయితే మిగిన ఐదు మంది మంత్రులు ఎవరు ? అంటూ ఇప్పుడు తమిళనాడులో జోరుగా చర్చ జరుగుతోంది.
-
అనసూయకు అవమానం..? వీడియో -
వంట గ్యాస్ గండం, సిలిండర్ల బుకింగ్..సరఫరా పై తాజా ఆంక్షలు..!! -
డిగ్రీలెందుకు దండగ.. గాడిదలు ఉంటే పండగ! -
మనకు మరో వందేభారత్, రెండు అమృత్ భారత్ ఖరారు- ఇక 3 గంటల్లోనే, రూట్..!! -
ఇక సెలవ్.. బీహార్ లో ముగిసిన నితీష్ శకం..!! -
వాంఖెడే ఈ నలుగురికీ కొట్టిన పిండే: అయినా డేంజర్- అచ్చిరాని పిచ్ -
Ind Vs Eng:సెమీస్ వేళ బ్యాటింగ్ లో మార్పులు, గంభీర్ కొత్త లెక్కలు - సెంటిమెంట్..!! -
ఓటీటీలోకి 'పూకీ' మూవీ.. ఇక రచ్చ రచ్చే..! -
ఏపీలో అద్దిరిపోయే రైల్వే స్టేషన్- ఆ జిల్లాకు బెటర్ కనెక్టివిటీ -
వధువు కంటే వదినే హైలైట్.. ఆ రాయల్ లుక్ మామూలుగా లేదుగా! -
T20 World Cup:సెమీస్ వేళ పఠాన్ కీలక సూచన-సౌతాఫ్రికాను కొట్టిన కివీస్ ప్లాన్..! -
నాగ చైతన్య నెవర్ బిఫోర్ అవతార్.. కేరీర్ బిగ్టెస్ట్ హిట్ ప్రామిస్












Click it and Unblock the Notifications