జమిలి ఎన్నికలతో ఆ పార్టీకే లాభం? తేల్చేసిన కమిటీ ఛీఫ్ రామ్ నాథ్ కోవింద్..!
దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికల నిర్వహణకు కేంద్రం, ఎన్నికల కమిషన్ మల్లగుల్లాలు పడుతున్నాయి. ఓవైపు వీటి నిర్వహణ వల్ల ప్రయోజనం ఉంటుందని అందరూ చెప్తున్నా కేంద్రం మాత్రం తన రాజకీయ అవసరాల్ని దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తగా అడుగులేస్తోంది. ఓవైపు ఈసీ తాము జమిలి ఎన్నికల నిర్వహణకు సిద్ధంగానే ఉన్నట్లు తేల్చేసింది. అటు లా కమిషన్ మాత్రం కాస్త సమయం పడుతుందని వెల్లడించింది. ఈ నేపథ్యంలో జమిలి ఎన్నికలపై కేంద్రం నియమించిన కమిటీ ఛైర్మన్, మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఇవాళ కీలక వ్యాఖ్యలు చేశారు.
జమిలి ఎన్నికలతో ఎవరికి ప్రయోజనం ఉంటుందని అడిగితే కేంద్రం, ఈసీ, లా కమిషన్, చివరికి జమిలి ఎన్నికల కమిటీ కూడా అందరికీ అంటున్నాయి. జమిలి ఎన్నికలతో భారీగా ప్రజాధనం, సమయం ఆదా అవుతాయని, కాబట్టి ఇవి అందరికీ ప్రయోజనం చేకూరుస్తాయని చెబుతున్నారు. కానీ ఇవాళ జమిలి ఎన్నికల కమిటీ ఛైర్మన్ రామ్ నాథ్ కోవింద్ మరో అడుగు ముందుకేసి ఏ పార్టీకి వీటితో ప్రయోజనం ఉంటుందో కూడా చెప్పేశారు.

కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలకే జమిలి ఎన్నికలతో ప్రయోజనం ఉంటుందని మాజీ రాష్ట్రపతి కూడా అయిన రామ్ నాథ్ కోవింద్ తేల్చిచెప్పేశారు. అది బీజేపీ కావొచ్చు, కాంగ్రెస్ కావొచ్చు, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకే జమిలి ఎన్నికలకు లబ్ది చేకూరుతుందని అసలు విషయం చెప్పేశారు. దీంతో ఇప్పుడు రామ్ నాథ్ కోవింద్ వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ప్రస్తుతం జమిలి ఎన్నికలకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలు కచ్చితంగా బీజేపీయే రాజకీయంగా ప్రయోజనం చేకూరుస్తాయని విపక్షాలు ఇప్పటికే గగ్గోలు పెడుతున్న నేపథ్యంలో కోవింద్ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీలో విలేకరులతో మాట్లాడిన కోవింద్.. అన్ని జాతీయ పార్టీలతో మాట్లాడి జమిలి ఎన్నికలపై వారి సూచనలను కోరినట్లు చెప్పారు. ప్రతి రాజకీయ పార్టీ ఏదో ఒక సమయంలో దానికి మద్దతు ఇస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రతి రాజకీయ పార్టీ కూడా ఎప్పుడో ఒకప్పుడు వీటికి మద్దతిచ్చిందని, దేశానికి మేలు జరిగేలా నిర్మాణాత్మకంగా సహకరించాలని అన్ని పార్టీలను అభ్యర్థిస్తున్నట్లు కోవింద్ వెల్లడించారు. ఇది దేశ ప్రయోజనాలకు సంబంధించిన అంశం అని తెలిపారు.
-
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం!












Click it and Unblock the Notifications