ప్రీతిజింతా, నెస్ వాడియా వేధింపుల కేసు: మరో ట్విస్ట్
ముంబై: తన మాజీ ప్రియుడు నెస్ వాడియా పైన బాలీవుడ్ నటి ప్రీతిజింతా కేసు పెట్టిన విషయం తెలిసిందే. మే 30వ తేదీన స్టేడియంలో నెస్ వాడియా తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారని ప్రీతిజింతా ఫిర్యాదు చేశారు. అయితే దీనిపై మరో కోణం తాజాగా వినిపిస్తోంది.
తాను ప్రీతి జింతా పైన ఆగ్రహం వ్యక్తం చేయడానికి గల కారణాలు నెస్ వాడియా చెప్పారట. మే 30వ తేదీన వాంఖేడే స్టేడియంలో మ్యాచ్ సందర్భంగా ప్రీతి జింతా అతని తల్లిని ఇరవై నిమిషాల పాటు నిలబడేలా చేసిందట. దీనిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారట.
అయితే, ఈ విషయాన్ని పక్కన పెట్టిన ప్రీతిజింతా తాను ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు ఫిర్యాదు చేయడం ఆశ్చర్యకరమని ఆయన చెబుతున్నారట. ప్రీతిజింతా తన పైన ఫిర్యాదు చేయడంపై నెస్ వాడియా దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
మరోవైపు నెస్ వాడియాకు సమన్లు జారీ చేసేముందు పోలీసులు ప్రీతిజింతాను స్టేట్మెంట్తో పాటు మరికొందరిని విచారించనున్నారట. ఇదిలా ఉండగా... ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇద్దరు సాక్ష్యులను గుర్తించిన విషయం తెలిసిందే. అయితే వారు పోలీసులకు సహకరించడం లేదని సమాచారం.