Wife: పుట్టింటిలో భార్య దెబ్బ, ఫ్యామిలీతో కలిసి భార్య ఏం చేసిందంటే ?, బిత్తరపోయి !
లూథియానా/ పంజాబ్: వివాహం చేసుకున్న దంపతులు కొంతకాలం సంతోసంగా కాపురం చేశారు. అయితే పుట్టింటి దగ్గర భార్య ఏం పెట్టిందో ఏమో కాని చీటికిమాటికి పుట్టింటికి వెళ్లిపోవడం, తరువాత భర్త ఇంటికి తిరిగిరావడం చేస్తోంది. చాలాకాలం పాటు భార్య ప్రవర్తనలో మార్పు తీసుకురావాలని భర్త అనేక ప్రయత్నాలు చేశాడు. అయితే భార్య మాత్రం ఆమె పద్దతి మార్చుకోలేదు. పుట్టింటికి వెళ్లి అక్కడే మకాం వేసిన భార్యను పిలుచుకుని రావాలని, లేదంటే ఆమె విషయం ఏదోఒకటి తేల్చుకోవాలని డిసైడ్ అయిన భర్త అత్తారింటి దగ్గరకు వెళ్లారు. భార్యతో పాటు అత్తారింటి వాళ్లు పవర్ ఫుల్ స్కెచ్ వేసి అల్లుడిని సినిమా రైంజ్ చితకబాదేశారు. అల్లుడు అసలు మ్యాటర్ చెప్పడంతో పోలీసులు సైతం బిత్తరపోయారు.

మొదట్లో హ్యాపీ
పంజాబ్ లోని లూథియానాలోని తిబ్బా పోలీస్ స్టేషన్ పరిధిలోని కరమ్ సర్ కాలనీలో హీనా శర్మా అనే యువతి నివాసం ఉంటున్నది. కొన్ని సంవత్సరాల క్రితం హీనా శర్మాకు గర్ శంకర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న గగన్ దీప్ సింగ్ అనే వ్యక్తికి వివాహం జరిగింది. వివాహం జరిగిన తరువాత గగన్ దీప్ సింగ్, హీనా శర్మా చాలా సంతోషంగా ఉండేవాళ్లు.

పుట్టింటికి భార్య పరుగో పరుగు
వివాహం జరిగిన సంవత్సరం పాటు హీనా శర్మా ఆమె భర్త గగన్ దీప్ సింగ్ తో చక్కగా సంసారం చేసింది. తరువాత హీనా శర్మా పుట్టింటికి ఎక్కువగా వెళ్లిరావడం మొదలుపెట్టింది. పుట్టింటి దగ్గర హీనా శర్మా ఏం పెట్టిందో ఏమో కాని చీటికిమాటికి పుట్టింటికి వెళ్లిపోవడం, కొంతకాలం తరువాత గౌరిశంకర్ లోని ఆమె భర్త గగన్ దీప్ సింగ్ ఇంటికి తిరిగిరావడం చేస్తోంది.

భర్తను లెక్కచెయ్యకుండా ?
చాలాకాలం పాటు భార్య హీనా శర్మా ప్రవర్తనలో మార్పు తీసుకురావాలని ఆమె భర్త గగన్ దీప్ సింగ్ అనేక ప్రయత్నాలు చేశాడు. అయితే హీనా సింగ్ మాత్రం ఆమె పద్దతి మార్చుకోలేదు. పుట్టింటికి వెళ్లకూడదని గగన్ దీప్ సింగ్ అతని భార్య హీనా సింగ్ కు చెప్పినా ఆమె ఏమాత్రం పట్టించుకోలేదు.

ఏదో ఒకటి తేల్చుకుందామని ?
ఇటీవల పుట్టింటికి వెళ్లి అక్కడే మకాం వేసిన భార్య హీనా శర్మాకు ఫోన్ చేసిన గగన్ దీప్ సింగ్ నువ్వు ఇంటికి రావాలని పదేపదే చెప్పాడు. అయితే భర్త మాటలు లెక్కచెయ్యని హీనా ను పిలుచుకుని రావాలని, లేదంటే ఆమె విషయం ఏదోఒకటి తేల్చుకోవాలని డిసైడ్ అయిన గగన్ దీప్ సింగ్ అత్తారింటి దగ్గరకు వెళ్లాడు. అక్కడ గగన్ దీప్ సింగ్, అతని భార్య హీనా సింగ్ కు పెద్ద గొడవ జరిగింది.

భర్తకు పీకలదాక తాగించి పొట్టు తీసేశారు
భార్య హీనా సింగ్ తో పాటు అత్తారింటి వాళ్లు పవర్ ఫుల్ స్కెచ్ వేసి గగన్ దీప్ సింగ్ ను ఇంట్లోకి పిలుచుకుని వెళ్లారు, తరువాత గగన్ దీప్ సింగ్ కు పీకలదాక మద్యం సేవించిన హీన్ సింగ్, ఆమె కుటుంబ సభ్యులు సినిమా రైంజ్ లో చితకబాదేశారు. తరువా గగతన్ దీప్ సింగ్ ను ఇంటి నుంచి బయటు గెంటేశారు.

మెలుకు వచ్చి చూస్తే
ఉదయం మెలుకు వచ్చిన గగన్ దీప్ అతని భార్యతో పాటు ఆమె కుటుంబ సభ్యులు అక్షయ్ శర్యా, పల్లవి శర్మా, కమలేష్ శర్మా తన మీద దాడి చేశారని గగన్ దీప్ సింగ్ కేసు పెట్టాడు. అల్లుడు అసలు మ్యాటర్ చెప్పడంతో పోలీసులు సైతం బిత్తరపోయారు. అయితే ఈ కేసులో ఇంకా ఎవ్వరిని అరెస్టు చెయ్యలేదని పోలీసు అధికారులు అంటున్నారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications