టెన్నిస్ క్లబ్లో మహిళపై సెక్యూరిటీ గార్డుల గ్యాంగ్రేప్
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో మరో దారుణం జరిగింది. టెన్నిస్ క్లబ్లో తన పేరును రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు వచ్చిన ఓ మహిళ(30)పై ఇద్దరు సెక్యూరిటీ గార్డులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన బుధవారం చోటు చేసుకుంది.
తంకూరుకు చెందిన బాధితురాలు ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాధితురాలి ఫిర్యాదు ప్రకారం.. తన పేరును టెన్నిస్ క్లబ్లో నమోదు చేసుకునేందుకు వెళ్లిన బాధితురాలు.. రాత్రి 9గంటల ప్రాంతంలో క్లబ్ నుంచి తను బస చేసిన హోటల్కు బయల్దేరింది.
అయితే, చాలా చీకటిగా ఉందని చెప్పిన ఇద్దరు సెక్యూరిటీ గార్డులు... ఆమెకు సాయం చేస్తామని ఆమె వెంట వెళ్లారు. సిద్దగంగా సర్కిల్ చేరుకోగానే ఆమెను అడ్డుకుని సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. వైద్య పరీక్షల నిమిత్తం బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. నిందితులను విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.