రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో మహిళ ఆత్మహత్య

ఆమె శవం సీలింగ్ ఫ్యాన్కు వేలాడుతూ ఉండడాన్ని శుక్రవారం ఐదున్నర గంటల ప్రాంతంలో కుటుంబ సభ్యులు చూశారు. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆమె అప్పటికే మరణించినట్లు వైద్యులు చెప్పారు.
ఆమె ఆత్మహత్యకు గల కారణం తెలియరాలేదు. సూసైడ్ నోట్ ఏదీ లభించలేదని పోలీసులు తెలిపారు. కొన్ని నెలల క్రితం ఆమెకు భర్త విడాకులు ఇచ్చాడు. దాంతో మనస్తాపానికి గురై ఆమె ఆత్మహత్య చేసుకుని ఉంటుందని అనుమానిస్తున్నారు.
భర్తతో విడిపోయిన తర్వాత ఆమె తన తండ్రితో కలిసి ఉంటోందని ఓ పోలీసాఫీసర్ చెప్పాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.












Click it and Unblock the Notifications