మరో దారుణం: యువతిపై స్నేహితురాలి భర్తతోపాటు 11మంది గ్యాంగ్రేప్
మోగా: పంజాబ్ రాష్ట్రంలోని మోగాలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. కదులుతున్న బస్సులో లైంగిక వేధింపులకు పాల్పడి తల్లికూతుళ్లను బయటికి తోసిన ఘటన మరువకముందే ఈ దారుణం జరిగింది. ఈ ఘటనలో తల్లికి తీవ్రగాయాలు కాగా, కూతురు మృతి చెందింది.
ప్రస్తుత ఘటనలో బాధిత యువతి బుధవారం తన స్నేహితురాలి ఇంటికి వెళ్లింది. అక్కడ స్నేహితురాలి భర్త, మరికొంత మంది కలిసి ఆమెను గ్రామ సమీపంలోని పొలాల్లోకి బలవంతంగా తీసుకెళ్లారు. అక్కడే ఓ గదిలో ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

తన స్నేహితురాలి భర్త మరికొంత మందిని పిలిపించి తనపై అత్యాచారం చేయించాడని బాధిత యువతి పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొంది. తనతోపాటు వచ్చిన తన స్నేహితుడ్ని నిందితులు తీవ్రంగా కొట్టారని తెలిపింది. ప్రస్తుతం అతడు మోగ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఆమె తెలిపింది. తనపై 12 నుంచి 13మంది నిందితులు దాడి చేశారని బాధితురాలి స్నేహితుడు తెలిపాడు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు బాధితురాలి స్నేహితురాలు, ఆమె భర్త, మరో పది నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఇప్పటి వరకు ఎవర్నీ అదుపులోకి తీసుకోలేదు. కాగా, వైద్య పరీక్షల్లో బాధితురాలిపై అత్యాచారం జరిగినట్లు వెల్లడైందని పోలీసులు తెలిపారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications