వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బస్సులో మహిళపై గ్యాంగ్ రేప్

|
Google Oneindia TeluguNews

బరేలి: బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికురాలి మీద డ్రైవర్, కండెక్టర్ సామూహిక అత్యాచారం చేసిన సంఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. ఈ లైంగిక దాడిలో (28) ఏళ్ల మహిళ తన 14 రోజుల పసికందును పోగొట్టుకుని ఆర్తనాదాలు చేస్తున్నది. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

పోలీసుల కథనం మేరకు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. రాయ్ పూర్ కు చెందిన (28) ఏళ్ల బాలింత తన 14 రోజుల కుమారుడితో పాటు ఇద్దరు బిడ్డలతో కలిసి బరేలిలోని సోదరి ఇంటికి వెళ్లింది. మంగళవారం రాత్రి ఓ ప్రయివేటు బస్సులో రాయ్ పూర్ కు బయలుదేరింది.

బస్సు స్టాప్ లో ప్రయాణికులు అందరూ దిగిపోయారు. ఆ మహిళ నిద్రమత్తులో అలాగే నిద్రపోయింది. బస్ స్టాప్ వచ్చిన విషయం గమనించలేకపోయింది. బస్సులో ఒంటరిగా మిగిలిపోయిన మహిళ మీద బస్సు డ్రైవర్, కండెక్టర్ కన్ను పడింది. బస్సును అక్కడి నుంచి తీసుకు వెళ్లారు.

Woman gang raped on bus in Bareilly

నిర్జనప్రదేశంలోకి తీసుకు వెళ్లి బాలింత మీద సామూహిక అత్యాచారం చేశారు. ఆ సమయంలో ఆమె చేతిలో ఉన్న 14 రోజుల బిడ్డ కింద జారిపడి మరణించాడు. నిందితులు ఆమెను రోడ్డు మీద వదిలి పెట్టి బస్సుతో సహ అక్కడి నుంచి మాయం అయ్యారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఆమెను ఆసుపత్రికి తరలించి వైద్య పరిక్షలు చేయించామని పోలీసులు అన్నారు. బస్సును గుర్తించామని, డ్రైవర్, కండెక్టర్ కోసం గాలిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు. మహిళా దినోత్సవం సందర్బంగా ఇలాంటి సంఘటన జరగడం దారుణమని, నిందితులను కఠినంగా శిక్షించాలని పలు మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

English summary
The 28-year-old woman boarded a mostly empty private bus last night with her two children, including a 14-day-old boy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X