యాకూబ్ మెమెన్ తీరని కోరిక: ముందే ఉరి
నాగపూర్: ముంబై పేలుళ్ల కేసు నిందితుడు యాకూబ్ మెమన్కు ఓ కోరిక తీరకుండానే ఉరిశిక్ష పడే అవకాశం ఉంది. నాగపూర్ సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తూనే రాజనీతిశాస్త్రంలో మాస్టర్ డిగ్రీ పూర్తి చేసిన ఆయన ఆ పట్టాను అందుకోవడానికి ముందే జూలై 30న ఉరికొయ్య ఎక్కే సూచనలు కనిపిస్తున్నాయి.
వృత్తిరీత్యా చార్టెడ్ అకౌంటెంట్ అయిన మెమన్ జైలుశిక్ష అనుభవిస్తూనే 2010-12 మధ్యకాలంలో ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్సిటీ నుంచి ఆంగ్ల సాహిత్యంంలో ఎంఏ పట్టా అందుకున్నాడు. ఆ తర్వాత 2014 వరకు రాజనీతి శాస్త్రంలో విద్యను అభ్యసించాడు.

అయితే భద్రతా కారణాల వల్ల ఎంఏ ఇంగ్లీష్ పట్టాను అందుకోవడానికి అనుమతి లభించకపోవడంతో 2013 ఆగస్టులో సర్టిఫికెట్ను ఆయనకు జైలులోనే అందజేశారు. రాజనీతి శాస్త్రంలో రెండో మాస్టర్ డిగ్రీని 2014 డిసెంబర్లో పూర్తి చేసినా పట్టాను ఇంకా అందుకోలేదు.
రాజనీతి శాస్త్రంలో ఎంఎ పట్టా తీసుకునేంత వరకు యాకూబ్ మెమెన్ జీవించే పరిస్థితి లేదు. ఆంగ్ల సాహిత్యంలోనూ రాజనీతి శాస్త్రంలోనూ మెమెన్ చాలా శ్రద్ధ చూపించాడని ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్శిటీ ప్రాంతీయ డైరెక్టర్ డాక్టర్ శివ స్వరూప్ అంటున్నట్లు ఇండియన్ ఎక్స్ప్రెస్లో వార్త వచ్చింది. యాకూబ్ మెమెన్ 1962 జులై 30వ తేదీన జన్మించాడు.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications