బీజేపీకి రివర్స్, జేడీఎస్ వైపు 10మంది!: యడ్యూరప్ప రాజీనామా చేస్తారంటూ ఊహాగానాలు?
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీలో యడ్యూరప్ప బల నిరూపణ దగ్గర పడుతున్న కొద్దీ ఉత్కంఠ నెలకొంది. మరో రెండు గంటల్లో బలపరీక్ష ప్రారంభం కానుంది. దీంతో కర్ణాటకలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. లెక్కలు కూడా మారుతున్నాయి. మరోవైపు, సీఎం యడ్యూరప్ప రాజీనామాపై వదంతులు కూడా వినిపిస్తున్నాయి.
జేడీఎస్, కాంగ్రెస్ పార్టీలలోని పలువురు లింగాయత్ ఎమ్మెల్యేలకు బీజేపీ గాలం వేస్తోంది. దీంతో బీజేపీలోని పదిమంది ఒక్కలింగ, ఇతర ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ - జేడీఎస్ గాలం వేస్తోందని తెలుస్తోంది. దీంతో ఏం జరుగుతుందోననే ఉత్కంఠ అందరిలోను నెలకొంది. కర్ణాటక పరిణామాలపై దేశం యావత్తు ఉత్కంఠగా ఎదురు చూస్తోంది.

మరోవైపు, అసెంబ్లీలో మాట్లాడేందుకు యడ్యూరప్ప పదమూడు పేజీల లేఖను సిద్ధం చేసుకున్నారు. ఎమ్మెల్యేల అందరూ మూడున్నరకు అసెంబ్లీకి రావాలని కాంగ్రెస్ పార్టీ విప్ జారీ చేసింది.












Click it and Unblock the Notifications