ఔను వాళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు.. పాడు జంట..! సభ్యసమాజానికి ఏ మెస్సేజ్ ఇస్తారో..?
న్యూజెర్సీ/హైదరాబాద్ : ఇదో రకమైన రుగ్మత. పాడు రుగ్మత.. సమాజాన్ని భ్రష్టు పట్టించే రుగ్మత. ఆడ మగ ఒకరినొకరు చూసుకోవడం, ఇష్టపడడం, ప్రేమించుకోవడం, పెళ్లి చేసుకోవడం సమాజంలో అత్యంత సహజం. అది ప్రకృతి ధర్మం కూడా. అలా కాకుంగా ఆడవాళ్లను ఆడవాళ్లు, మగ వాళ్లను మగ వాళ్లు చూసుకోవడం ఏందో, ఇష్టపడడం ఏందో, ప్రేమించుకోవడం ఏందో, తర్వాత పెళ్లి చేసుకోవడం ఏందో..అంతా విచిత్రంగా అనిపిస్తుంటుంది.
వినడానికే వింతగా ఉన్న ఈ సంఘటన ఇద్దరు భారతీయుల మద్య జరిగిందని తెలుసుకుని అవాక్కవుతున్నారు జనం. నేటి కాలంలో స్వలింగ వివాహాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఇద్దరు అమ్మాయిలు లేదా ఇద్దరు అబ్బాయిలు పెళ్లి చేసుకోవడం చాలా చిన్న విషయంగా మారింది. ఇక ఇలాంటి పెళ్ళిళ్ళు సాధారణ పెళ్లిల లాగానే ఎంతో ఆర్భాటంగా, సంప్రదాయంగా జరుగుతున్నాయి.

ఇద్దరు అమ్మాయిలు పెళ్లి చేసుకోవడం ఎక్కువగా చూసాం కానీ..ఇద్దరు అబ్బాయిలు ఇలా చేయడం చాలా అరుదు. కాగా ఇటీవల ఇద్దరు మగాళ్ళు అమెరికాలో తమ పెళ్లిని పెద్దల అంగీకారంతో ఎంతో ఘనంగా జరుపుకున్నారు. ఇప్పుడు తాజాగా అలాంటి సంఘటనే మరోకటి వెలుగులోకి వచ్చింది. ఇక వారు భారతీయులే కావడం మరో విశేషం..ఇక వివరాలలోకి వెళితే... అమెరికాలోని న్యూజెర్సీలో భారత్కు చెందిన అమిత్ షా, ఆదిత్య మదిరాజు జంట భారత సంప్రదాయంలో వివాహం చేసుకుంది. రాబిన్స్విల్లోని బీఏపీఎస్ శ్రీ స్వామినారాయణ్ మందిర్లో వీరి వివాహం ఘనంగా జరిగింది. వారి తల్లిదండ్రులు, స్నేహితులు దగ్గరుండి వీరి వివాహాన్ని జరిపించడం విశేషం. ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఈ జంట తమ ఫొటోలను అప్లోడ్ చేయగా....అవి కాస్తా వైరల్ అయిపోయాయి నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇలా ఊహించని రీతిలో పెళ్లి జరగడంతో...జంట ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దీనిపై వారు మాట్లాడుతూ..ఇలా గుడిలో తమ పెళ్లి జరుగుతుందని, అది కూడా పెద్దలు, స్నేహితుల మధ్య ఇంత ఆనందంగా జరుపుకుంటామని కలలో కూడా అనుకోలేదని సంబ్రమాశ్చర్యాలను వ్యక్తం చేస్తున్నారు ఈ నూతన దంపతులు.
-
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !!












Click it and Unblock the Notifications