యూపీలో శాంతియుతంగా రంజాన్ పండుగ-మత ఘర్షణలు లేవన్నయోగీ ఆదిత్యనాథ్..
ఉత్తర్ ప్రదేశ్ లో రంజాన్ పండుగ ఎలా జరిగిందన్న దానిపై యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. యూపీలో మత సామరస్యం లేదని, పండుగల సమయంలో మత ఘర్షణలు చోటు చేసుకుంటాయన్న వాదన నేపథ్యంలో యోగీ ఈ వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా రంజాన్, బక్రీద్ వంటి ముస్లిం పండుగల సమయంలో ఈ మతఘర్షణలు జరుగుతాయన్న విమర్శలపై యోగీ స్పందించారు.
రాష్ట్రంలో ఎలాంటి అల్లర్లు లేవని శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా యోగీ ఈ ప్రకటన చేశారు. ఈద్ సందర్భంగా రాష్ట్రంలో అల్లర్లు లేవన్నారు. ఎవరి రాకపోకలకు ఇబ్బంది లేదన్నారు. శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని యోగీ వెల్లడించారు. శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని, ఇది చట్టం అందరినీ సమానంగా చూస్తుందనే వాదనకు బలం చేకూరుస్తుందన్నారు.

గతంలో అజంగఢ్ వంటి జిల్లాలంటే భయపడేవారని, కానీ నేడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయని యోగీ ఆదిత్యనాథ్ తెలిపారు. ప్రస్తుతం అజంగఢ్ నగరం ఎక్స్ప్రెస్వే హైవేతో అనుసంధానమైందని జిల్లాలో విమానాశ్రయం, యూనివర్సిటీ కూడా రాబోతున్నాయని సీఎం యోగీ పేర్కొన్నారు. శాంతిభద్రతల పరిస్ధితిని సమర్ధించుకున్న యోగీ ఆదిత్యనాథ్.. భయం, అరాచకం లేదన్నారు. విధ్వంసం నేడు వేడుకలుగా మారిన వేళ.. ఇలాంటి పాలన ప్రజల విశ్వాసానికి ప్రతీకగా మారుతుందన్నారు.
అంతకు ముందు సీఎం యోగీ ఆదిత్యనాథ్.. ముస్లింలకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో మత సామరస్యంపై, ముస్లింలపై జరుగుతున్న దాడులపై విమర్శలు ఎదురవుతున్న వేళ.. ఈ ఏడాది రంజాన్ వేడుకల నిర్వహణ విషయంలో యోగీ సర్కార్ పలు జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రార్ధనలు ప్రశాంతంగా సాగాయని ఆయనే స్వయంగా ప్రకటించారు.
-
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
అమెరికాకు షాక్, రష్యా నుంచి 60 మిలియన్ బ్యారెళ్ల చమురు! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!












Click it and Unblock the Notifications