Yogi Cabinet: మోదీ లెక్కలు, 9 మంది దళితులు, 20 మంది బీసీలు, అన్ని కులాలకు, బీజేపీ టార్గెట్ 2024!
లక్నో/ఉత్తరప్రదేశ్: ఉత్తరప్రదేశ్ లో ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్న తరువాత మళ్లీ మరోసారి ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ రెండోసారి బాధ్యతలు స్వీకరించారు. ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ దాదాపు 37 ఏళ్ల తరువాత చరిత్ర తిరగరాశారు. ఐదేళ్ల అధికారం పూర్తి చేసుకున్న తరువాత శుక్రవారం సాయంత్రం తిరిగి మరోసారి యోగి ఆదిత్యనాథ్ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. ఉత్తరప్రదేశ్ లో మొత్తం 403 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ లో బీజేపీ 255 సీట్లు గెలుచుకుని తిరుగులేని పార్టీగా అవతరించింది.
ఉత్తరప్రదేశ్ లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 41.29 శాతం ఓట్లు సంపాధించింది. మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన యోగి ఆదిత్యనాథ్ ను ప్రధాని నరేంద్ర మోదీతో పాటు బీజేపీ పెద్దలు ఆశీర్వదించారు. యోగి ఆదిత్యనాథ్ కేబినేట్ లో కులాల ప్రతిపాదికన మంత్రి పదవులు కట్టబెట్టారు. 9 మంది దళితులు, 20 మంది బీసీలు, ముస్లీం, సిక్ లు, యాదవులు, జూట్ కు యోగి ఆదిత్యనాథ్ కేబినెట్ లో మంత్రి పదవులు కట్టబెట్టారు.
యోగి ఆదిత్యనాథ్ కేబినేట్ లో మొత్తం 52 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన కేశవ్ ప్రసాద్ మౌర్య ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. 2024 ఎన్నికలను టార్గెట్ చేసుకున్న బీజేపీ ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ కేబినేట్ లో అన్ని కులాలకు ప్రాధాన్యత ఇచ్చిందని బీజేపీ నాయకులు కొందరు అంటున్నారు.
Lady teacher: అబ్బాయిని లేపుకుపోయి గుడిలో పెళ్లి, ఎంఫీల్ మేడమ్ కు జైల్లో చిప్పకూడు, కన్నింగ్ లేడి!
చరిత్ర తిరగరాసిన యోగి
ఉత్తరప్రదేశ్ లో ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్న తరువాత మళ్లీ మరోసారి ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ రెండోసారి బాధ్యతలు స్వీకరించారు. ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ దాదాపు 37 ఏళ్ల తరువాత చరిత్ర తిరగరాశారు. ఐదేళ్ల అధికారం పూర్తి చేసుకున్నయోగి ఆదిత్యనాథ్ మరోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు.
ప్రతిపక్షాల మైండ్ బ్లాక్
ఉత్తరప్రదేశ్ లో మొత్తం 403 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ లో బీజేపీ 255 సీట్లు గెలుచుకుని తిరుగులేని పార్టీగా అవతరించింది. ఉత్తరప్రదేశ్ లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 41.29 శాతం ఓట్లు సంపాధించింది. మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన యోగి ఆదిత్యనాథ్ ను ప్రధాని నరేంద్ర మోదీతో పాటు బీజేపీ పెద్దలు ఆశీర్వదించారు.
దళితులు, బీసీలకు పెద్దపీట
యోగి ఆదిత్యనాథ్ కేబినేట్ లో కులాల ప్రతిపాదికన మంత్రి పదవులు కట్టబెట్టారు. 9 మంది దళితులు, 20 మంది బీసీలు, ముస్లీం, సిక్ లు, యాదవులు, జూట్ కు యోగి ఆదిత్యనాథ్ కేబినెట్ లో మంత్రి పదవులు కట్టబెట్టారు. యోగి ఆదిత్యనాథ్ కేబినేట్ లో మొత్తం 52 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.
బీజేపీనే నమ్ముకున్న ముస్లీం నాయకుడు
ఉత్తరప్రదేశ్ లో ముస్లీం మైనారిటీల మంత్రిగా డానిష్ ఆజాద్ అన్సారీ బాధ్యతలు స్వీకరించారు. లక్నో విశ్వవిద్యాలయంలో ఆర్ఎస్ఎస్ అనుబంధ విద్యార్థి సంస్థ ఏబీవీపీలో అనేక పదవులు చేపట్టిన ఆజాద్ అన్సారీ ఉత్తరప్రదేశ్ బీజేపీ మైనార్టీ మోర్చా ఉపాధ్యక్షుడిగా పని చేశారు.
బీజేపీకి ముస్లీంలు అందరూ దూరం అయినా ఆజాద్ అన్సారీ మాత్రం ఆ పార్టీ విడిచిపెట్టలేదు. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ కేబినెట్ లో ఆజాద్ అన్సారీ మంత్రి పదవి దక్కించుకున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ టార్గెట్ 2024!
యోగి ఆదిత్యనాథ్ కేబినేట్ లో మొత్తం 52 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన కేశవ్ ప్రసాద్ మౌర్య ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. 2024 ఎన్నికలను టార్గెట్ చేసుకున్న బీజేపీ ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ కేబినేట్ లో అన్ని కులాలకు ప్రాధాన్యత ఇచ్చిందని బీజేపీ నాయకులు కొందరు అంటున్నారు.