కాశ్మీర్ కోసమే రాళ్లు రువ్వుతున్నారు: ఫరూక్ అబ్దుల్లా
కాశ్మీర్ యువత దేశం కోసమే భద్రతా దళాలపైకి రాళ్లు రువ్వుతోందని జమ్ము కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా అన్నారు.
శ్రీనగర్: కాశ్మీర్ యువత దేశం కోసమే భద్రతా దళాలపైకి రాళ్లు రువ్వుతోందని జమ్ము కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా అన్నారు.
మతం పేరుతో విభజించాలనుకుంటున్నవారి పైనే తమ పోరాటం అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీకి తాను ఓ విషయం చెప్పదలుచుకున్నానని, టూరిజం మా జీవితం అని, అందులో ఎలాంటి సందేహం లేదని చెప్పారు.

అలాగే, రాళ్లు విసరడం వల్ల టూరిజానికి వచ్చిన ముప్పేమీ లేదన్నారు. వారు దేశం కోసం రాళ్లు విసురుతున్నారన్నారు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలన్నారు. భారత్-పాక్లు తమ సమస్యలను పరిష్కరించుకోలేవని, ఈ విషయంలో అమెరికా మధ్యవర్తిత్వం అవసరమని, ఆ దేశం ముందుకు రావాలన్నారు.
కాగా, ఇటీవల అతిపెద్ద టన్నెల్ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మోడీ కాశ్మీర్ యువతను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కాశ్మీర్ యువతకు ఓ వైపు తీవ్రవాదం, మరోవైపు పర్యాటక రంగం అందుబాటులో ఉన్నాయని, రెండింటిలో పర్యాటకాన్ని ఎంచుకోవాలని హితవు పలికారు. దీనికి ఫరూక్ అబ్దుల్లా కౌంటర్ ఇచ్చారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ!











Click it and Unblock the Notifications