పాక్లో రన్ వే మీద జారి పోయిన విమానం
ఇస్లామాబాద్: పాకిస్థాన్ కు చెందిన విమానానికి పెద్ద ప్రమాదం తప్పింది. విమానంలో సాంకేతిక లోపం తలెత్తడం, అదే సమయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చెయ్యడంతో టైర్ పేలిపోయింది. ఈ ప్రమాదంలో కొందరు ప్రయాణికులకు చిన్నచిన్న గాయాలు అయ్యాయి.
పాకిస్థాన్ కు చెందిన షాహీన్ ఎయిర్ లైన్స్ విమానం బయలుదేరింది. అందులో 276 మంది ప్రయాణికులు ఉన్నారు. టేకాఫ్ తీసుకున్న తరువాత విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. వెంటనే పైలెట్ విమానాశ్రయం అధికారులకు సమాచారం ఇచ్చాడు.
అధికారులు లాహోర్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చెయ్యాలని సూచించారు. లాహోర్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేస్తున్న సమయంలో విమానం టైర్ పేలిపోయింది. విమానంలోని ప్రయాణికులు కేకలు వేశారు.
అదే సందర్బంలో రన్ వే మీద నుంచి విమానం పక్కకు జారీ పోయింది. విమానాశ్రయం సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని అత్యవసర ద్వారం నుంచి ప్రయాణికులను కిందకు దించారు. ఈ ప్రమాదంలో 10 మంది ప్రయాణికులకు చిన్నచిన్న గాయాలైనాయని అధికారులు తెలిపారు.