హెచ్చరికలు బేఖాతరు: అమెరికాకు షాకిచ్చిన భారత్ సహా 128 దేశాలు
న్యూయార్క్: జెరూసలేం విషయంలో అమెరికాకు ఐక్యరాజ్య సమితిలో చుక్కెదురైంది. ఇజ్రాయెల్ రాజధానిగా జెరూసలెంకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన గుర్తింపును ఉపసంహరించుకోవాలని పేర్కొంటూ చేసిన తీర్మానానికి భారీ మద్దతు లభించింది.
ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో గురువారం ఈ తీర్మానానికి అనుకూలంగా భారత్ సహా 128 దేశాలు ఓటు వేశాయి. ఈ తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసిన దేశాలకు అమెరికా ఆర్థిక సహాయంలో కోత పెడతామని ట్రంప్ హెచ్చరించారు.

అయినప్పటికీ ఆ బెదిరింపులను పట్టించుకోలేదు ఈ 128 దేశాలు. ట్రంప్ హెచ్చరికల ప్రభావం స్వల్పంగా మాత్రమే కనిపించింది. కేవలం 9 దేశాలు మాత్రమే ఈ తీర్మానాన్ని వ్యతిరేకించాయి.
అయితే అమెరికాకు మిత్ర దేశాల్లో కొన్ని పాశ్చాత్య, అరబ్ దేశాలు ఈ తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయడం గమనార్హం. 35 దేశాలు ఓటింగ్ నుంచి గైర్హాజరయ్యాయి.
More From
-
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
గుడ్ న్యూస్: భారత్ కోసం ఇరాన్ కీలక నిర్ణయం! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం












Click it and Unblock the Notifications