మనోళ్లపై ట్రంప్ కు ఇంకా కోపం చల్లారినట్టులేదు
Donald Trump: అమెరికాలో నివసించే అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఈ విషయంలో భారత్ కూడా మినహాయింపు కాదు. అన్ని దేశాలకు చెందిన అక్రమ వలసదారుల భరతం పడుతున్నారు. అక్రమంగా నివసించే భారతీయులను వెనక్కి పంపించే కార్యక్రమానికి ఇదివరకే తెర తీసిన అమెరికా.. దీన్ని మరింత ముమ్మరం చేసింది. విదేశాంగం- రక్షణ మంత్రత్వ శాఖ సంయుక్తంగా ఈ ఏరివేతను చేపట్టాయి.
గతంలో 205 మంది భారతీయులను సీ-17 మిలటరీ ఎయిర్క్రాఫ్ట్ ద్వారా భారత్ కు పంపించిన విషయం తెలిసిందే. వారందరినీ కూడా చేతులకు బేడీలు వేసి, కాళ్లకు సంకెళ్లతో బంధించి ఏకంగా మిలిటరీ హెలికాప్టర్లో స్వదేశానికి పంపించింది. అక్రమ వసలదారులు అమెరికా గడ్డపై నివసించడానికి ఏ మాత్రం అర్హులు కారనీ స్పష్టం చేసింది. జన్మతః పౌరసత్వ హక్కును రద్దు చేయడంతో పాటు నాన్ అమెరికన్లకు జన్మించిన పిల్లలకు ఆటోమేటిక్ ఆ దేశ పౌరసత్వం లభించే విధానానికి స్వస్తి పలికింది.

ఇప్పుడు తాజాగా 54 మంది భారతీయులను స్వదేశానికి పంపించింది. వీరిలో 50 మంది హర్యానాకు చెందినవారే. 'డంకీ రూట్' ద్వారా వాళ్లు అమెరికాలోకి ప్రవేశించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ఈ బృందాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ 54 మందిలో కర్నాల్- 16, కైథల్- 15, అంబాలా- 5, యమునానగర్- 4, కురుక్షేత్ర-4, జింద్-3, సోనిపట్- 2 ఉన్నారు. పంచ్ కుల, పానిపట్, రోహ్తక్, ఫతేహాబాద్ జిల్లాలకు చెందిన ఒక్కొక్కరు ఉన్నారు. ఎక్కువమంది 25 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు వారే.
దీనికి సంబంధించిన వివరాలను కర్నాల్ డీఎస్పీ సందీప్ కుమార్ వెల్లడించారు. డంకీ రూట్ ద్వారా అక్రమంగా వాళ్లు అమెరికాలోకి ప్రవేశించారని, వారి వద్ద ఎటువంటి వాల్యూడ్ డాక్యుమెంట్లు లేకపోవడం వల్ల అమెరికన్ అధికారులు స్వదేశానికి పంపించారని చెప్పారు. కుటుంబాలకు అప్పగించామని, ఇప్పటివరకు ఏ ట్రావెల్ ఏజెంట్పైనా ఫిర్యాదు అందలేదని అన్నారు. అక్రమ మార్గాల్లో విదేశాలకు వెళ్లకూడదని, భవిష్యత్తులో చాలా సమస్యలకు దారితీస్తుందని చెప్పారు.
అమెరికాలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదం తర్వాత ఈ డిపోర్ట్ చోటు చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కాలిఫోర్నియాలో ఓ భారతీయుడు రోడ్డు ప్రమాదానికి కారణం అయ్యాడు. ఎస్యూవీని ఢీకొట్టాడు. అది చైన్ రియాక్షన్ కు దారి తీసింది. ఒక దాని వెెనుక మరొక వాహనం ప్రమాదానికి గురయ్యాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు. ఈ కేసులో నిందితుడు 21 ఏళ్ల జస్మన్ ప్రీత్ సింగ్ కూడా అక్రమ వలసదారుడే. 2022లో అతను డాంకీ రూట్ గుండా అమెరికాలో ప్రవేశించాడు.
-
ఇరాన్ వార్ ఆపేద్దాం సార్..? ట్రంప్ కు సలహాదారుల షాక్.! -
యుద్ధం ముగుస్తుందా? ఇరాన్పై ట్రంప్ సంచలన ప్రకటన! -
వంట గ్యాస్ కొరత, వారికి నిలిపివేత- ప్రభుత్వం తాజా మార్గదర్శకాలు..!! -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..!












Click it and Unblock the Notifications