తూర్పు ఫిలిప్పీన్స్ను వణికించిన భూకంపం: 6.2గా తీవ్రత నమోదు
మనీలా: ఫిలిప్పీన్స్ దేశంలో మంగళవారం భూకంపం సంభవించింది.
తూర్పు ఫిలిప్పీన్స్ తీరంలో 6.2 తీవ్రతతో భూకంపం సంభవించిందని యుఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. ప్రధాన ద్వీపం లుజోన్కు సమీపంలో ఉన్న కాటాన్డ్వానెస్ ద్వీపానికి 120 కిలోమీటర్ల (74 మైళ్లు) దూరంలో రాత్రి 9:00 గంటల సమయంలో (1300 GMT) నిస్సార భూకంపం సంభవించిందని USGS తెలిపింది.
అలాగే, ఫిలిప్పీన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వోల్కానాలజీ అండ్ సిస్మోలజీ ప్రకారం.. ఫిలిప్పీన్స్ తీరంలో మంగళవారం 9 కిలోమీటర్ల లోతులో 6.6 తీవ్రతతో భూకంపం సంభవించిందని CGTN నివేదించింది. రాత్రి 9:00 గంటల సమయంలో (1300 GMT) లుజోన్ ప్రధాన ద్వీపానికి 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాటాండ్వాన్స్ ద్వీపంలో భూకంపం సంభవించినట్లు నివేదించింది. భూకంపం కారణంగా ప్రజలు తమ నివాసాల నుంచి బయటికి తీశారు.

కాగా, లోతైన భూకంపాల కంటే నిస్సార భూకంప తరంగాలు ఎక్కువ నష్టాన్ని కలిగిస్తాయి. అయితే ఇప్పటివరకు నగరానికి తక్షణ నష్టం జరిగినట్లు ఎలాంటి నివేదికలు లేవు. 'ఈ భూకంప తరంగాలు నష్టం కలిగించేంత బలంగా లేవు' అని గిగ్మోటో మునిసిపాలిటీలో విపత్తు అధికారి ప్రిన్స్ ఒబో చెప్పారు.
భూకంపం వచ్చినప్పుడు తాను ఇంట్లోనే ఉన్నానని చెప్పారు ఒబో. ఆయన ఇంటి వెలుపల తన పొరుగువారితో కలిసేందుకు వెళుతుండగా భవనం కదిలినట్లుగా అనిపించిందని తెలిపారు. తన క్యాబిన్లో చాలా వస్తువులు కదలడం, ఊగడం చూశానని చెప్పారు. అయితే, ఏ వస్తువులు కూడా కిందపడలేదని తెలిపారు.












Click it and Unblock the Notifications