విషాదం: బోటు ప్రమాదంలో 17 మంది జలసమాధి: పలువురు గల్లంతు: 60 మందితో
మెక్సికో సిటీ: అగ్రరాజ్యం అమెరికా-బహమాస్ సముద్ర తీరంలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. సముద్రంలో శరణార్థులు ప్రయాణిస్తోన్న బోటు ప్రమాదానికి గురైన ఘటనలో 17 మంది జలసమాధి అయ్యారు. మరో 25 మంది భద్రత బలగాలు కాపాడాయి. మియామి తీర ప్రాంతానికి సమీపంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని తెలుస్తోంది. మృతులందరూ హైతీ దేశస్థులుగా గుర్తించారు. వారంతా అక్రమంగా అమెరికా వెళ్లడానికి ప్రయత్నించినట్లు నిర్ధారించారు.
న్యూ ప్రావిన్స్ నగరానికి ఏడు నాటికన్ మైళ్ల దూరంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. స్పీడ్ బోట్ సామర్థ్యానికి మించి ప్రయాణించడం ద్వారా ప్రమాదానికి గురైంది. బలమైన ఈదురుగాలులు తోడు కావడంతో పల్టీ కొట్టింది. ఈ ఘటనలో పలువురు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే భద్రత బలగాలు సంఘటన స్థలానికి చేరుకున్నాయి. 25 మందిని కాపాడగలిగాయి. అదే సమయంలో 17 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నాయి.

దుర్ఘటన సమయంలో స్పీడ్బోట్లో 60 మంది వరకు అక్రమ వలసదారులు ఉన్న నేపథ్యంలో- మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం లేకపోలేదని.. సహాయక చర్యలకు నాయకత్వాన్ని వహిస్తోన్న బహమాస్ పోలీస్ కమిషనర్ క్లేటర్ లెరాయ్ ఫెర్నాండర్ తెలిపారు. ఈ ఘటన వెనుక మానవ అక్రమ రవాణా గ్యాంగ్ ప్రమేయం ఉన్నట్లు నిర్ధారించినట్లు తెలిపారు. ఎలాంటి డాక్యుమెంట్స్ లేకుండా అక్రమంగా అమెరికాకు తరలించడానికి ఈ గ్యాంగ్స్ ప్రయత్నించినట్లు చెప్పారు. ఇప్పటివరకు ఇద్దరిని అరెస్ట్ చేశామని పేర్కొన్నారు.
ఓ స్పీడ్ బోట్ ద్వారా హైతీయన్లు శరణార్థులుగా మియామికి చేరుకోవడానికి ప్రయత్నించినట్లు బహమాస్ ప్రధానమంత్రి ఫిలిప్ డేవిస్ వెల్లడించారు. దీనిపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించామని చెప్పారు. హైతీ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం లేకపోలేదని అన్నారు. పేదరికం, నేరాలతో సహజీవనం చేస్తోన్న పరిస్థితుల్లో వాళ్లంతా హైతీని వీడాలని, అక్రమంగా అమెరికా వెళ్లడానికి ప్రయత్నించారని చెప్పారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications