Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

గాల్లోకి ఎగిరిన యూఎస్ విమానం: ఆప్ఘాన్ మహిళకు నొప్పులు, పైలట్ అప్రమత్తతో సేఫ్

కాబూల్: తాలిబన్ల అరాచకాల భయంతో ఆప్ఘాన్ ప్రజలు దేశం విడిచిపారిపోతున్న విషయం తెలిసిందే. బతికుంటే చాలనుకుని అక్కడే ఆస్తులన్నింటినీ వదిలేసుకుని విదేశాలకు బయల్దేరుతున్నారు. కాబూల్ విమానాశ్రయం ఆవరణలో ఆప్ఘాన్ ప్రజలు కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. హదయాలను కలచివేసే ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.

కాగా, శనివారం ఆప్ధాన్‌కు చెందిన ఓ నిండు గర్భణీ.. యూఎస్ ఎయిర్ ఫోర్స్ సీ-17 విమానం ఎక్కారు. జర్మనీలోని అమెరికాకు చెందిన రాంస్టెయిన్ బేస్‌కు బయల్దేరింది. అయితే, ప్రయాణ క్రమంలో భూమి నుంచి 8500 మీటర్ల ఎత్తుకు చేరుకోవడంతో విమానంలో లో-ఎయిర్ ప్రెషర్ ఏర్పడింది. దీంతో ఆ నిండు గర్భిణీకి నొప్పులు మొదలయ్యాయి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురవడంతో ఆమె పరిస్థితి ఆందోళనకరంగా మారింది. దీంతో అప్రమత్తమైన పైలట్.. వెంటనే విమానాన్ని తక్కువ ఎత్తుకు తీసుకొచ్చారు.

 Afghanistan woman gives birth to baby girl aboard US evacuation plane

విమానంలో లోపల వాయు పీడనాన్ని పెంచి.. ఆ గర్భిణీ ప్రాణాలను కాపాడారు. బేస్‌లో ల్యాండ్ అయ్యాక వైద్య సిబ్బంది హుటాహుటిన ఆమె వద్దకు చేరుకున్నారు. విమానంలోనే ప్రసవం చేశారు. ఆమె పండంటి ఆడ శిశివుకు జన్మనిచ్చారు. అనంతరం వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

ఈ విషయాన్ని అమెరికా ఎయిర్ మొబిలిటీ కమాండ్ అధికారులు ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. తల్లీ బిడ్డ పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని తెలిపారు. ఈ ట్వీట్‌పై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తూ సదరు పైలట్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరోవైపు, ఆఫ్గనిస్తాన్‌లో తాలిబన్ల అరాచకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాలిబన్ల మాటలకు వారి చేతలకు అసలు పొంతనే లేదు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని... ఎవరినీ శత్రువుల్లా భావించమని,కక్ష సాధింపు చర్యలు ఉండవని తాలిబన్లు శాంతి వచనాలు వల్లించారు. కానీ ప్రస్తుతం ఆఫ్గనిస్తాన్‌లో పరిస్థితి అందుకు పూర్తి విరుద్దంగా ఉంది. తాలిబన్ల అరాచకాలను తట్టుకోలేక అక్కడి ప్రజలు ఆర్తనాదాలు పెడుతున్నారు. అమెరికా మాజీ కాంగ్రెస్ నేత మార్క్ వాకర్ తాజాగా అమెరికన్ రేడియోకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాలిబన్ల అరాచకాల గురించి వెల్లడించారు.

ప్రస్తుతం ఆఫ్గనిస్తాన్‌లో చోటు చేసుకుంటున్న పరిణామాలు అత్యంత దారుణంగా ఉన్నాయని మార్క్ వాకర్ పేర్కొన్నారు.'ఆఫ్గనిస్తాన్‌లో జరుగుతున్న దారుణాల గురించి కొన్ని కథనాలు వినిపిస్తున్నాయి. ఓ క్రిస్టియన్ వ్యక్తిని తాలిబన్లు చిత్రహింసలకు గురిచేసినట్లు చెబుతున్నారు. అతని చర్మం ఒలిచి స్తంభానికి వేలాడదీశారని అంటున్నారు.' అని మార్క్ వాకర్ పేర్కొన్నారు. అతని కుటుంబ సభ్యుల ముందే తాలిబన్లు ఈ దారుణానికి పాల్పడ్డారని చెప్పారు.మంగళవారం ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలిసిందన్నారు.

తాలిబన్ల పాలనలో ఎవరిపై కక్ష సాధింపు చర్యలు ఉండవని... మిలటరీతోనూ తమకెలాంటి శత్రుత్వం లేదని ఇటీవల తాలిబన్లు ప్రకటించారు. కానీ సైనికులను పట్టుకునేందుకు ఇంటింటికీ తాలిబన్లు సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. మరోవైపు ఆడపిల్లల కుటుంబాలను వేధింపులకు,హింసకు గురిచేస్తున్నారు. వారి కూతుళ్లను తమతో పంపించాలని... తమకిచ్చి పెళ్లిళ్లు చేయాలని తాలిబన్లు ఆ కుటుంబాలను వేధిస్తున్నారు. కొన్నిచోట్ల యువతులను చెక్క పెట్టెల్లో నిర్బంధించి సెక్స్ బానిసలుగా ఇతర దేశాలకు తరలిస్తున్నారు.

మహిళా జర్నలిస్టులను ఇప్పటికే ఆయా మీడియా సంస్థలు ఇంటికి పంపించేశాయి. తాలిబన్ల పాలనలో మహిళల రాజకీయానికి తావు లేదని ఇటీవల వెలుగుచూసిన ఓ వీడియోలో తాలిబన్ల మాటలను బట్టి అర్థమైంది. స్వేచ్చ,హక్కులు మృగ్యమైన చోట ప్రస్తుతం తాలిబన్లు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఏ క్షణాన ఏ తాలిబన్ తుపాకీ తమను ఎక్కుపెడుతుందో తెలియని ఆందోళనలో బతుకుతున్నారు. దేశం విడిచి పారిపోయేందుకు వేలాది మంది కాబూల్ విమానాశ్రయానికి తరలివస్తున్నా... ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడి నుంచి వారిని తరలించడం అసాధ్యంగా కనిపిస్తోంది. భారత్‌,అమెరికాకు చెందిన వందలాది మంది కాబూల్‌లోనే చిక్కుకుపోయి ఇప్పటికీ సహాయం కోసం ఎదురుచూస్తున్నారు.

కాబూల్ విమానాశ్రయం వద్ద 20 మంది మృతి

Recommended Video

    Taliban 2.0 : Co-Education నిషేధం.. స్త్రీ కేవలం సంతానం కోసమే ? | Afghanistan || Oneindia Telugu

    తాలిబన్ల ఆధీనంలోకి ఆప్ఘానిస్థాన్ వెళ్లిన నాటి నుంచి కాబూల్ విమానాశ్రయంలో 20 మంది వరకు ప్రజలు మృతి చెందారని నాటో దళాలు పేర్కొన్నాయి. తాజాగా, విమానాశ్రయం ఆవరణలో తాలిబన్లు కాల్పులు జరపడంతో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ఏడుగురు మృతి చెందారు. కాలూబ్ విమానాశ్రయం అమెరికా భద్రతా దళాల ఆధీనంలో ఉండగా.. విమానాశ్రయం చుట్టూ తాలిబన్లు పెద్ద ఎత్తున మోహరించారు. విమానాశ్రయానికి వచ్చేవారిని తాలిబన్లు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. పలువురిని విమానాశ్రయానికి వెళ్లకుండా అడ్డుకుని తిరిగి పంపిస్తున్నారు. చంపుతామంటూ బెదిరింపులకు గురిచేస్తున్నారు. దీంతో విదేశాలకు వెళ్లాలనుకునే ఆప్ఘాన్ పౌరులు భయభ్రాంతులకు గురవుతున్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+