ఎయిడ్స్ బాంబ్: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల కొత్త అస్త్రం
మారణ హోమం సృష్టిస్తున్న ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు (ఐసిస్) ఎయిడ్స్ బాంబును కొత్త అస్త్రంగా సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. తలలు నరుకుతూ, సామూహిక మానభంగాలకు పాల్పడుతూ ఐసిస్ ఉగ్రవాదులు ఘోర ఆకృత్యాలకు పాల్పడుతోన్న విషయం తెలిసిందే.
తాజాగా, వారు ఎయిడ్స్ బాంబును అస్త్రంగా మార్చుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగా హెచ్ఐవీ పాజిటివ్ ఉన్న తమ ఫైటర్లను శత్రు దేశాల పైకి ప్రయోగించేందుకు సిద్ధం చేసుకుందని సమాచారం.
తమ పరీక్షల్లో హెచ్ఐవీ పాజిటివ్గా తేలిన 16 మంది సాయుధులను ఈ ఆపరేషన్ కోసం ఎంపిక చేసిందంటున్నారు. వీరిలో ఎక్కువ మది విదేశీయులే ఉన్నారని తెలుస్తోంది. ప్రస్తుతం వీరిని సిరియాలోని హసాకా ప్రావిన్స్ ప్రాంతంలోని ఓ గదిలో ఉంచారంటున్నారు.
వీరిని సూసైడ్ బాంబర్స్గా ప్రయోగించనున్నారని తెలుస్తోంది. గతంలో ఒక ఇండోనేషియా ఫైటర్.. సెక్స్ స్లేవ్కు ఎయిడ్స్ అంటించి ఐసిస్ ఉగ్రవాదుల అమ్మేశాడు. తద్వారా వారిలో ఎయిడ్స్ ప్రబలేలా చేశాడు. తన రక్తాన్ని దాం చేయడం ద్వారా మరికొంతమందికి ఎయిడ్స్ అందించాడు.
ఈ వ్యక్తిని రెండు నెలల క్రితం ఉరి తీశారు. దీంతో వారు తమ ఫైటర్స్కు పరీక్షలు నిర్వహిస్తున్నారు. పాజిటివ్గా తేలినవారిని శత్రు దేశాల పైకి ప్రయోగించనున్నారని తెలుస్తోంది.