కారు బాంబు దాడులు: 37 మంది బలి
అంకారా: టర్కీ రాజధానిలో నిత్యం రద్దిగా ఉండే ప్రాంతంలో కారులో వెళ్లిన ఉగ్రవాది ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో 34 మంది సంఘటనా స్థలంలో దుర్మరణం చెందారు. దాదాపు 125 మందికి పైగా తీవ్రగాయాలై వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని టర్కీ అధికారులు చెప్పారు.
టర్కీ రాజధాని అంకారాలోని కిజిలే స్కేర్ సమీపంలో కి బాంబులు, మందు పాతరలు నింపుకుని కారులో వెళ్లిన ఉగ్రవాది తనను తాను పేల్చుకున్నాడు. ఈ దాడిలో అతని తో పాటు 34 మంది అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసి పోయాయి. ప్రాణభయంతో ప్రజలు చెల్లాచెదురుగా పరుగు తీశారు.

వాణిజ్య భవనాలు, ట్రాన్స్ పోర్ట్ హబ్ లు అధికంగా ఉన్న ఈ ప్రాంతంలో చాల నష్టం జరిగిందని పోలీసు అధికారులు తెలిపారు. అదే విధంగా సోమవారం సాయంత్రం మహిళా ఉగ్రవాది తనను తాను పేల్చుకోవడంతో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. పలువురికి తీవ్రగాయాలైనాయి.
గత ఐదు నెలల నుంచి ఉగ్రవాదులు టర్కీ పార్లమెంట్ భవనం, విదేశీ కార్యాలయాలు లక్షంగా చేసుకుని ఆత్మాహుతి దాడులకు పాల్పడుతున్నారు. అయితే ఈ దాడులకు తామే బాధ్యులు అని ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదని, రెండు కేసులు దర్యాప్తులో ఉన్నాయని పోలీసు అధికారులు తెలిపారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications