కారు బాంబు పేలుడు: ఆరుగురు దుర్మరణం
బాగ్దాద్: ఉగ్రవాద కార్యకలాపాలు అడ్డుకుంటున్నారని ఇరాక్ లోని ఒక స్వచ్చంద సంస్థ నిర్వహకులను టార్గెట్ చేసుకుని ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు కారు బాంబు పేలుళ్లు సృష్టించారు. ఈ దాడిలో ఆరుగురు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.
అనేక మంది పౌరులకు తీవ్రగాయాలైనాయి. ఉత్తర బాగ్ధాద్ నగరానికి 35 కిలోమీటర్ల దూరంలోని ఖలిస్ పట్టణంలో కారు బాంబు పేలుడు జరిగింది. ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా హషద్ అల్ షాహిబ్ అనే సంస్థ పని చేస్తున్నది.
ఐఎస్ఐఎస్ కార్యాకలాపాలను తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తు ప్రజలలో చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ విషయం జీర్ణించుకోలేని ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు ఆ సంస్థను టార్గెట్ చేసుకున్నారు. ఎలాగైనా సంస్థ నిర్వహకులను అంతం చెయ్యాలని నిర్ణయించారు.

ఆ సంస్థ నిర్వహకులను అంతం చెయ్యడానికి ప్రముఖ వైద్యుడి ఇంటి ముందు కారు బాంబు పేలుడు సృష్టించారు. ఈ పేలుడులో ఆరుగురు మరణించారని, 12 మందికి తీవ్రగాయాలైనాయని పోలీసు అధికారులు తెలిపారు.
కారు బాంబు పేలుడు జరిగిన ప్రాంతానికి సమీపంలో ఉగ్రవాదులు ఒక లేఖ విడిచిపెట్టి వెళ్లారని ఖలిస్ పోలీసులు చెప్పారు.ఆ లేఖలో తమకు వ్యతిరేకంగా పని చేసే వారికి ఇదే గతి పడుతుందని, ఐఎస్ఐఎస్ కార్యకలాపాలకు మద్దతు ఇవ్వాలని వ్రాసి ఉందని పోలీసులు అన్నారు. ఖలీస్ పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications