అంటార్కిటికాకూ పాకిన కరోనా వైరస్... చిలీ బృందంలో పాజిటివ్ కేసులు - BBC Newsreel
కరోనావైరస్ అంటార్కిటికా ఖండానికి కూడా పాకింది.అక్కడి బర్నార్డో ఓహిగిన్స్ పరిశోధక కేంద్రంలో 36 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు చిలీ సైన్యం తెలిపింది.
కరోనా సోకినవారిలో 26 మంది సైనికులు, 10 మంది ఇతర సిబ్బంది ఉన్నట్లు చిలీ సైన్యం పేర్కొంది. వీళ్లందరినీ చిలీకి వెనక్కిపిలిపించినట్లు తెలిపింది.
అంటార్కిటికాలో మొత్తంగా నాలుగు శాశ్వత పరిశోధక కేంద్రాలు ఉన్నాయి. వీటిలో బర్నార్డో ఓహిగిన్స్ పరిశోధక కేంద్రం ఒకటి. ఈ కేంద్రం చిలీ సైన్యం నిర్వహణలో ఉంది.
ఈ కేంద్రానికి అవసరమైన వస్తువులను, మనుషులను తరలించేందుకు ఉపయోగించే సర్హెంతో ఆల్దియా అనే ఓడలో ముగ్గురికి కరోనా సోకినట్లు కొన్ని రోజుల క్రితమే చిలీ నావికాదళం ధ్రువీకరించింది.
నవంబర్ 27న ఈ ఓడ అంటార్కిటికాకు వెళ్లి, డిసెంబర్ 10న చిలీకి తిరిగివచ్చింది.
అంటార్కిటికా పర్యటనకు వెళ్లిన తమ వాళ్లందరికీ పీసీఆర్ పరీక్షలు చేయించామని, అందరికీ ఫలితం నెగటివ్ వచ్చిందని చిలీ నావికా దళం తెలిపింది.
అంటార్కిటికాలోనూ కరోనా కేసులు నమోదు కావడంతో ఇప్పుడు భూమి మీద ప్రతి ఖండానికీ కరోనావైరస్ పాకినట్లైంది. ఇదివరకు ఆ ఖండంలో కేసులు నమోదు కాలేదు.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగ యంత్రాంగం పని చేయడం లేదనే వివాదంలో హైకోర్టు ఆదేశాలపై స్టే ఇచ్చిన సుప్రీం కోర్టు
- ఏపీ రాజధాని చుట్టూ ఏడాదిగా ఏం జరిగింది? అమరావతి భవితవ్యం ఏంటి?
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ: మెరుగైన మహిళా సాధికారత... కలవరపెడుతున్న పోషకాహార లోపం -జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే
- భారత్: ఒకపక్క ఊబకాయం.. మరోపక్క పోషకాహార లోపం.. ఎందుకిలా?
- కరోనావైరస్: భారత్లో గల్లంతవుతున్న కోవిడ్ మరణాలు ఎన్ని?
- కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్, హెర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏంటో మీకు తెలుసా?
- భారత్లో కోవిడ్-19 వ్యాక్సీన్ హ్యూమన్ ట్రయల్స్ రెండు, మూడు దశలకు డీసీజీఐ అనుమతి
- కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్, హెర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏంటో మీకు తెలుసా?
- శకుంతలా దేవిని హ్యూమన్ కంప్యూటర్ అని ఎందుకు పిలుస్తారంటే..
- జునాగఢ్ ఆశతో పాకిస్తాన్ కశ్మీర్ను చేజార్చుకుందా, ఈ సంస్థానం భారత్లో ఎలా కలిసింది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)