ఇక ఆంత్రాక్స్ వంతు.. ఆంత్రాక్స్ న్యూమోనియా.. చైనాలో వెలుగులోకి..
కరోనా వైరస్ రూపాంతరం చెందుతోంది. వేరియంట్స్, ఫంగస్ పేరుతో భయాందోళన కలిగిస్తోంది. అయితే కరోనా ఆవిర్భవించిన చైనాలో ఆంత్రాక్స్ న్యూమోనియా కేసు ఒకటి వెలుగుచూసింది. హెబీ ప్రావిన్స్ ఉత్తరాన గల చెంగ్డే నగరంలో కేసు బయటపడింది. దీంతో మరింత భయాందోళన కలుగుతుంది.
సదరు రోగికి పశువులు, గొర్రెల ద్వారా ఆంత్రాక్స్ న్యూమోనియా వచ్చినట్టు తెలిసింది. అతనిని అంబులెన్స్లో బీజింగ్ తరలించి.. అక్కడ అతనికి వైద్య సేవలు అందిస్తున్నారు. అతనిని క్వారంటైన్లో ఉంచినట్టు పేర్కొన్నారు. ఈ మేరకు గ్లోబల్ టైమ్స్ రిపోర్ట్ చేసింది. అనారోగ్యంతో ఉన్న పశువులు, సంపర్కం ద్వారా ఆంత్రాక్స్ సోకుతుంది. ఈ మేరకు బీజిగ్ సెంటర్ ఫర్ డిసిజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపింది.
ఆంత్రాక్స్ న్యూమోనియా చాలా డేంజర్. ధూళి ద్వారా జనాలకు సోకుతుంది. కలుషిత ఆహారం, మాంసం ద్వారా కూడా ఆంత్రాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆంత్రాక్స్ వస్తే వికారం, వాంతులు, విరేచనాలు కలుగుతాయని వైద్య నిపుణులు తెలిపారు. ఆంత్రాక్స్ నేరుగా మనుషుల ద్వారా వ్యాపిస్తోంది. జలుబు, కరోనా మాదిరిగా అంటు వ్యాధి మాత్రం కాదు.

ఇటు వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. థర్డ్వేవ్ పిల్లలకు అని ప్రచారం జరుగుతోంది. వచ్చే నెలలో అని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఆందోళన నెలకొంది. మరోవైపు వచ్చే ఏడాది సమ్మర్లో ఫోర్త్ వేవ్ అని కూడా అంటున్నారు. దీంతో కరోనా 5,6 ఏళ్లు ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.
Recommended Video
వానకాలం రావడంతో ఫంగస్ ఇంపాక్ట్ తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు బ్లాక్ ఫంగస్ ఇంపాక్ట్ కనిపించింది. మొత్తానికి కరోనాతో కలిసి బతకాల్సిందే.. అందుకోసం విధిగా మాస్క్ ధరించి.. శానిటైజర్ రాసుకుంటూ కాలం వెళ్లదీయాల్సిందే. రెండు డోసులతోపాటు బూస్టర్ డోస్ టీకా కూడా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అయితే అందరికీ సెకండ్ డోసు ఇస్తున్నారు. ఇది పూర్తయితే దేశంలో చాలా మంది రెండు డోసులు తీసుకున్నట్టు అవుతుంది. దీంతోపాటు బూస్టర్ డోసు వేసుకోవాలని నిపుణులు సూచన చేస్తున్నారు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం విధాన నిర్ణయం అయితే ప్రకటించలేదు. డిసిషన్ తీసుకోవాల్సి ఉంది.












Click it and Unblock the Notifications