వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎయిర్ ఏషియా: 162మంది సజీవ సమాధి, తేలుతున్న మృతదేహాలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

ఇండోనేషియా: సురబయ - సింగపూర్ విమానం క్యూజెడ్ 8501 విమానం జావా సముద్రంలో కూలిపోయినట్లుగా ఇండోనేషియా అధికారులు ధృవీకరించారు. 162 మందితో అదృశ్యమైన ఎయిర్ ఏషియా విమానాన్ని గుర్తించామని ఇండోనేషియా సివిల్ ఏవియేషన్ అధికారులు మంగళవారం ప్రకటించారు.

ఇండోనేషియాలోని బోర్నియా ద్వీపం సమీపంలో విమానం తలుపులు, స్లైడ్, ఇతర పరికరాలు గుర్తించినట్లుగా పౌర విమానయాన సంస్థ తెలిపింది. బోర్నియా ద్వీపంలో గుర్తించిన వస్తువులు విమాన గాలింపు చర్యల్లో అత్యంత కీలకమైనవిగా అధికారులు చెప్పారు.

పాఠకుల కోసం ఫేస్‌బుక్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా వార్తలు... లైక్ చేయండి.

Debris from AirAsia flight found, confirms Indonesia's civil aviation chief

కాగా, మృతదేహాలు సముద్రంలో తేలియాడుతున్నట్లుగా గుర్తించారు. జావా సముద్రంలో శకలాలు లభ్యమయ్యాయని ఇండోనేషియా ఏవియేషన్ అధికారులు ప్రకటించిన నేపథ్యంలో మృతుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.

ఈ ప్రమాదంలో 155 మంది ప్రయాణీకులు, 7గురు సిబ్బంది మృతి చెందారు. ఈ ప్రయాణీకులలో 149 మంది ఇండోనేషియన్లు, ముగ్గురు కొరియన్లు, సింగపూర్, బ్రిటన్, మలేషియా దేశాలకు చెందిన ఒక్కరు చొప్పున ఉన్నారు. కాగా, మృతుల కుటుంబాలకు పరిహారం ఇస్తామని ఎయిర్ ఏషియా చీఫ్ చెప్పారు.

English summary
The confirmation of AirAsia jet debris being spotted does come as a rude and shocking piece of news for the relatives of Flight QZ8501 passengers, dousing their hopes and any possibility that the plane might not have crashed and that their kins might be alive. Earlier, the relatives of AirAsia Flight 8501 passengers told BBC in they were hoping the debris does not turn out to be the missing plane.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X