ఇమ్రాన్ఖాన్కు భారత్ గట్టి జవాబు, ఆర్మీ రెండేళ్ల క్రితమే.. రెహామ్ ఖాన్ షాకింగ్
న్యూఢిల్లీ/కరాచి: భారత్తో స్నేహ సంబంధాలు కోరుకుంటున్నామని చెబుతూనే కాశ్మీర్ ఇష్యూపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పీటీఐ అధినేత, పాకిస్తాన్ కాబోయే ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు భారత్ గట్టి జవాబు ఇచ్చింది. తీవ్రవాదరహిత, హింసలేని దక్షిణాసియా కోసం ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం పని చేస్తుందని ఆశిస్తున్నామని భారత్ పేర్కొంది.
తద్వారా ఐఎస్ఐ, పాకిస్తాన్ ఆర్మీ ద్వారా హెచ్చుమీరుతున్న తీవ్రవాదాన్ని అణదొక్కితే రెండు దేశాల మధ్య సామరస్య వాతావరణం ఏర్పడుతుందని అభిప్రాయపడింది. ఇమ్రాన్ ఖాన్ కాశ్మీర్ వ్యాఖ్యలపై స్పందించలేదు. తద్వారా కాశ్మీర్ విషయంలో వారికి సంబంధం లేదని భారత్ అభిప్రాయపడింది.

అందుకోసం కొత్త ప్రభుత్వం పాటుపడుతుందని భారత్ ఆకాంక్ష
ఈ మేరకు శనివారం కేంద్ర విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. సార్వత్రిక ఎన్నికల ద్వారా ప్రజాస్వామ్యంపై పాకిస్తాన్ ప్రజల నమ్మకాన్ని స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. తమ పొరుగున ఉన్న పాకిస్తాన్ సంపన్నమైన, ప్రగతిశీల దేశంగా, ప్రశాంత దేశంగా ఉండాలని కోరుకుంటున్నామని పేర్కొంది. కొత్త ప్రభుత్వం రక్షణ, సుస్థిర, అభివృద్ధి గల తీవ్రవాదరహిత, హింసలేని దక్షిణాసియా నిర్మాణం కోసం పాటుపడుతుందని భావిస్తున్నామని పేర్కొన్నారు.

పాక్ ఎన్నికల ఫలితాలపై అమెరికా స్పందన
పాకిస్తాన్లో ఎన్నికలు జరిగిన తీరుపై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. భావ ప్రకటన స్వేచ్ఛపై ఆంక్షలు విధించారని, పాకిస్తాన్ దీర్ఘకాల సుస్థిరత, సుసంపన్నతల కోసం బలమైన ప్రజాస్వామిక, పౌర పాలన వ్యవస్థలు అవసరమని, ఎన్నికల్లో ఉగ్రవాదులు పాల్గొనడంపై తమకు గట్టి అభ్యంతరాలు ఉన్నాయని, బ్యాలెట్ పెట్టెల ద్వారా వారిని ఓటర్లు తిరస్కరించిన తీరును అభినందిస్తున్నామని, కొత్త ప్రభుత్వంతో కలిసి పనిచేసే అవకాశాల కోసం ఎదురు చూస్తున్నామని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నౌవెర్ట్ అన్నారు.

ముప్తీ ఫరూక్ అబ్దుల్లా సూచన
పాక్ ఎన్నికల్లో అందరికీ సమాన అవకాశాలు లభించలేదని యూరోపియన్ యూనియన్ పర్యవేక్షక బృందం ప్రధాన పరిశీలకులు మైఖేల్ గెహ్లర్ అన్నారు. కాశ్మీర్లో రక్తపాతానికి చరమగీతం పాడేందుకు ఇమ్రాన్ ఖాన్ చాచిన స్నేహహస్తాన్ని భారత ప్రధాని మోడీ అందుకోవాలని జమ్ము కాశ్మీర్ మాజీ సీఎంలు మెహబూబా ముఫ్తీ, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షులు ఫరూక్ అబ్దుల్లా సూచించారు.

ఇమ్రాన్ పార్టీపై రెహామ్ ఖాన్ తీవ్ర ఆరోపణలు
పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐ గెలవడంపై విపక్షాలతో పాటు ఆయన మాజీ భార్య రెహామ్ ఖాన్ కూడా మండిపడ్డారు. రిగ్గింగ్ వల్ల ఇమ్రాన్ పార్టీ గెలిచిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ మాజీ భార్య కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేశారు. పాక్ ఆర్మీ చేతిలో ఇమ్రాన్ కీలుబొమ్మ అన్నారు. ఇమ్రాన్ను ప్రధానిగా చేయాలని పాకిస్తాన్ ఆర్మీ రెండు మూడేళ్ల క్రితమే నిర్ణయించిందన్నారు. ఇమ్రాన్ పార్టీ తరఫున అనామకులు గెలిచారని, బాగా రిగ్గింగ్ జరిగిందని ఆరోపించారు.
-
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!!












Click it and Unblock the Notifications