లక్ష రూపాయల ధర పలికిన చేప: స్పెషాలిటీ ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
థాయ్ లాండ్ : మహా అయితే ఓ చేప రూ.1000వెయ్యి ధర దక్కించుకోవడం గురించి మనం వినుంటాం. కానీ థాయ్ లాండ్ లో ఓ చేప ఏకంగా 53,500 బాట్ (1,03,733 రూపాయల)ల ధర పలికి రికార్డుల్లోకి ఎక్కింది. కాగా, ఈ చేపకు ఇంత భారీ ధర పలకడానికి కారణం.. థాయ్ లాండ్ జాతీయ జెండా రంగును ఆ చేప పోలి ఉండడమే.

గతంలో ఇలాంటి చేపలను ఉత్పత్తి చేసినప్పటికీ.. ఇంత ఖచ్చితమైన రంగులో సత్ఫలితం రావడం ఇదే తొలిసారి. చేతితో రంగులద్దినట్టుగా సరైన ఖచ్చితత్వంతో కూడిన రంగులను కలిగి ఉంది ఈ చేప. ఫేస్ బుక్ వేదికగా గత నవంబర్ 6న 99 బాట్ ల ప్రారంభ ధరతో దీన్ని వేలానికి పెట్టగా.. నవంబర్ 9న ముగిసిన యాక్షన్ లో భారీ ధర దక్కించుకుంది.
ఈ చేప పెంపకందారుడైన కచెన్ వొరాచెయ్ సైతం ఇంత భారీ ధర పలుకుతుందని ఊహించలేకపోయాడట. వేలానికి పెట్టిన రెండో రోజే ఇది 10 వేల బాట్ లు పలికి, చివరకు 53,500 బాట్ లకు అమ్ముడుపోవడం పట్ల ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు.
-
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్












Click it and Unblock the Notifications