Maldives: మమ్మల్ని క్షమించరూ.. భారత్ కు మాల్దీవుల మాజీ అధ్యక్షుడి సారీ..!
భారత ప్రధాని మోడీపై మాల్దీవుల మంత్రుల అనుచిత వ్యాఖ్యల తర్వాత ఇరుదేశాల మధ్య తలెత్తిన గ్యాప్ అలాగే ఉంది. ఇప్పటికే మాల్దీవులను బహిష్కరించాలంటూ భారత్ ఇచ్చిన పిలుపు ప్రభావం ఆ దేశంపై తీవ్రంగా ఉంది. మోడీపై వ్యాఖ్యలు చేసిన మంత్రులతో రాజీనామాలు చేయించినా, ఆ తర్వాత మరో వ్యాఖ్య చేయకున్నా మాల్దీవులపై భారత్ లో వ్యతిరేకత మాత్రం అలాగే కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మరిన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయి.
తాజాగా మాల్దీవుల నుంచి భారత్ బలగాలను వెనక్కి తీసుకోవాలని కోరిన ఆ దేశాధ్యక్షుడు మొహమ్మద్ మొయిజు.. దీనికి డెడ్ లైన్ కూడా పెట్టేశారు. ఆ తర్వాత చైనా బలగాలను దేశంలోకి రప్పించేందుకు ప్లాన్ రెడీ చేశారు. ఈ నేపథ్యంలో భారత్ తో వివాదాలకు ముగింపు పలికేందుకు ఆ దేశ మాజీ అధ్యక్షుడు నషీద్ ప్రయత్నాలు ప్రారంభించారు. భారత్ అనుకూల నేతగా పేరున్న నషీద్.. తాజాగా భారత్ కు గతంలో చోటు చేసుకున్న ఘటనలపై క్షమాపణలు చెప్పారు.

మాల్దీవుల ప్రజల తరఫున భారత్ ను క్షమాపణ కోరుతున్నట్లు ఆ దేశ మాజీ అధ్యక్షుడు నషీద్ ప్రకటించారు. ప్రస్తుతం భారత్ లో పర్యటిస్తున్న ఆయన.. గతంలో చోటు చేసుకున్న ఘటనలు తమ ద్వీప దేశాన్ని తీవ్రంగా ప్రభావితం చేసినట్లు ఆయన తెలిపారు. వాటిపై మాల్దీవుల ప్రజల తరఫున క్షమాపణలు కోరుతున్నట్లు తెలిపారు. భారతీయ ప్రజలు తమ దేశంలో పర్యటించాలని కోరుకుంటున్నట్లు నషీద్ వెల్లడించారు. తమ ఆతిధ్యంలో ఎలాంటి మార్పూ ఉండబోదన్నారు.
మాల్దీవుల్లో ఉన్న భారత సైనికుల్ని రేపటి లోగా ఖాళీ చేసి వెళ్లాలని ప్రస్తుత అధ్యక్షుడు మొయిజు డెడ్ లైన్ విధించిన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల్ని తగ్గించేందుకు నషీద్ చేస్తున్న ప్రయత్నాలపై కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి. భారత్ కు అనుకూలమైన నేతగా పేరున్న నషీద్ క్షమాపణలపై ఇంకా స్పందించలేదు.
-
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
అమెరికాకు షాక్, రష్యా నుంచి 60 మిలియన్ బ్యారెళ్ల చమురు! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!












Click it and Unblock the Notifications