ఆ దేశంలో పుట్టడమే శాపమా..? యుద్ధంతో సర్వం కోల్పోయి.. ఐదు రూపాయల బిస్కెట్ ప్యాకెట్ ధర రూ. 2,300
పార్లేజీ బిస్కెట్లు అంటే చిన్నారులకు చాలా ఇష్టం కదా. కానీ ఆ దేశంలో పుట్టడం చిన్నారులకు శాపంగా మారింది. మన దేశంలో రూ. 5 కే దొరికే బిస్కెట్ ప్యాకెట్ ను కొనాలంటే ఆ దేశంలోని చిన్నారులు రూ. 2,300 చెల్లించాలి. భారత్ కు ఆ దేశానికి దాదాపు 4,300 కిలోమీటర్లు దూరం ఉంది. గాజాలో ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో ఈ ఒక్క విషయం చెబుతోంది.
చిన్నారులు ఇష్టంగా తినే బిస్కెట్ ప్యాకెట్ ధర భారత్ లో రూ. 5 ఉండగా గాజాలో మాత్రం 500 టైమ్స్ అధికంగా అమ్ముడవుతోంది. స్థానిక కరెన్సీ ప్రకారం 24 యూరోలు అంటే రూ. 2,300 చెల్లిస్తేనే ఓ బిస్కెట్ ప్యాకెట్ దొరుకుతుంది. మన దేశంలో చిన్నారులకు పార్లే-జీ బిస్కెట్ ప్యాకెట్ సుపరిచితమే.. టీ తాగే సమయంలోనూ తింటుంటారు. కానీ వార్ జోన్ ప్రాంతమైన గాజాలో మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది.
ఇజ్రాయెల్- హమాస్ ల మధ్య భీకర పోరు ఏళ్లకు ఏళ్లుగా సాగుతూనే ఉంది. అమెరికా లాంటి దేశాలు మధ్యవర్తిత్వం చేయాలని చూసినా చర్చలు ఫలించలేదు. యుద్ధం కారణంగా అక్కడి ప్రజల పరిస్థితి దయనీయంగా మారింది. అనేక మంది ప్రజలు ఆహారం కొనే పరిస్థితి లేక దాతల కోసం ఎదురుచూస్తున్నారు. భారత్ లో కేవలం ఐదు రూపాయలకే లభించే బిస్కెట్ ప్యాకెట్ ధర గాజాలో రూ. 2,300 ఉంది. దీన్ని బట్టే అక్కడ సంక్షోభం ఏ రేంజ్ లో ఉందో అర్థం అవుతోంది.

తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన ఓ వీడియో అక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది. ఓ తండ్రి తన కుమారుడికి ఇష్టమైన పార్లే- జీ బిస్కెట్ ప్యాకెట్ కొని తెచ్చాడు. ఆయన గతంలో కొన్నప్పుడు ఆ ప్యాకెట్ ధర 1.5 యూరోలు కానీ ఇప్పుడు 24 యూరోలు. అయినా తన కుమారుడికి ఈ బిస్కెట్స్ ఇష్టం కాబట్టి తీసుకురావడం తప్పడం లేదు. అని గాజాలోని ఓ తండ్రి ఎక్స్ వేదికగా చేసిన ఓ ఎమోషనల్ పోస్టు నెట్టింట వైరల్ అయింది. దీంతో అక్కడి పరిస్థితి ఎలా ఉందో ప్రపంచానికి అర్థమైంది.
After a long wait, I finally got Ravif her favorite biscuits today. Even though the price jumped from €1.5 to over €24, I just couldn’t deny Rafif her favorite treat. pic.twitter.com/O1dbfWHVTF
— Mohammed jawad 🇵🇸 (@Mo7ammed_jawad6) June 1, 2025
ఇటీవల వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం(WFP) కూడా ఇదే విషయంపై ఆందోళన వ్యక్తం చేసింది. గాజాలోని ప్రజలు కరవుతో అల్లాడుతున్నారు. యుద్ధం మళ్లీ తీవ్రతరం కావడంతో బోర్డర్లు అన్నీ మూసేశారు. ఆహార నిల్వల కొరత ఏర్పడింది. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు.. అని వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం అక్కడి పరిస్థితిని కళ్లకు కట్టింది.ఈ ఏడాది మార్చి 2 నుంచి ప్రపంచ దేశాల సాయం ఆగిపోయిందని.. అప్పటి నుంచి అక్కడి పిల్లలు పౌష్టికాహార లోపంతో ఉన్నారని వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం పేర్కొంది. గాజాలో దాదాపు 4 లక్షల 70 వేల మంది క్రిటికల్ హంగర్ సమస్యతో ఉన్నారని వివరించింది.
-
"ఇరాన్ దెబ్బకు అమెరికా ఖతం.. పీకల్లోతు చిక్కుల్లో.." -
అమెరికా-ఇరాన్ యుద్ధంలో బిగ్ ట్విస్ట్: రంగంలోకి హిజ్బుల్లా..! -
అమెరికా పరువుతీసిన పాకిస్థాన్.. మంత్రి సంచలన ట్వీట్! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!!











Click it and Unblock the Notifications