సర్కస్ లో గ్రేనేడ్ పేలుడు: 11 మందికి గాయాలు
లీమా: సర్కస్ ప్రదర్శన మైమరిచి తిలకిస్తున్న సమయంలో గ్రేనేడ్ పేలిపోయి పలువురికి తీవ్రగాయాలైనాయి. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసు అధికారులు తెలిపారు. సర్కస్ కు వెళ్లిన స్థానికులతో పాటు సిబ్బందికి గాయాలైనాయి.
పెరూలోని సన్ జయన్ డీ జిల్లాలో ఈ దారుణం చోటు చేసుకునింది. సర్కస్ చూడటానికి స్థానికులు చాల మంది వెళ్లారు. సర్కస్ ప్రదర్శన జరుగుతున్న సమయంలోనే పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 11 మందికి తీవ్రగాయాలైనాయి. అనేక మందికి చెవులు దెబ్బతిన్నాయి. పూర్తిగా వినపడటం లేదని అంటున్నారు.

సర్కస్ లో ఎర్పాటు చేసిన చెక్కలు పగిలిపోయి అనేక మంది శరీరంలోకి దూసుకు వెళ్లాయి. సర్కస్ సిబ్బందితో పాటు జంతువులకు గాయాలైనాయి. విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
శక్తి వంతమైన గ్రేనేడ్ పేలిందని పోలీసులు చెప్పారు. ముందుగానే గ్రేనేడ్ అమర్చారా, మధ్యలో బయట నుండి విసిరివేశారా అని ఆరా తీస్తున్నారు. ఇది దోపిడి దొంగల పనే అని పోలీసు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
గత కొన్ని నెలల నుండి పెరూలో దోపిడి దొంగలు రెచ్చిపోతున్నారు. ప్రయివేటు స్కూళ్లు, భవన నిర్మాణ సంస్థలు, ట్యాక్సీ డ్రైవర్లను లక్షంగా చేసుకుని దోపిడీలకు పాల్పడుతున్నారని పోలీసులు అన్నారు. గత నాలుగు నెలల నుండి ఇప్పటి వరకు 1,667 దోపిడీల కేసులు నమోదు అయ్యాయని పెరూ పోలీసు అధికారులు తెలిపారు.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications