భారతీయులకు మరింత భారంగా అమెరికా హెచ్1బీ వీసా
వాషింగ్టన్: అమెరికాకు వెళ్లే భారతీయులకు కొంత నిరాశ కలించే వార్త ఇది. హెచ్-1బీ వీసాల నమోదు ప్రక్రియలో మోసాలను అరికట్టేందుకు అమెరికా సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. 2025 ఆర్థిక సంవత్సరానికి జారీ చేసే వీసా ఎంపిక ప్రక్రియకు కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఇకపై ఒక లబ్ధిదారు బహుళ దరఖాస్తులు చేసుకున్నా ఒకే అప్లికేషన్గా పరిగణించనున్నారు.
ఒకే లబ్ధిదారుని తరఫున అనేక రిజిస్ట్రేషన్లు సమర్పించి సంస్థలు, లాటరీ విధానంలో ప్రయోజనం పొందేందుకు యత్నిస్తున్నందున అమెరికా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా, రిజిస్ట్రేషన్ల సంఖ్యతో సంబంధం లేకుండా దరఖాస్తుదారులకు సమాన అవకాశాలు కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా పౌరసత్వ, వలస సేవల విభాగం(USCIS) స్పష్టం చేసింది. ప్రతీ లబ్ధిదారు సరైన పాస్పోర్టు వివరాలు, ప్రయాణ పత్రాలను తప్పనిసరిగా సమర్పించాలి. తప్పుడు సమాచారం ఉన్న పిటిషన్లను తిరస్కరించే నిర్ణయం USCISకు ఉంది.

కాగా, పాస్పోర్టు, ఇతర గుర్తింపు వివరాల ఆధారంగా రిజిస్ట్రేషన్ను పరిగణనలోకి తీసుకుంటారు. హెచ్-1బీ వీసాల మొదటి రిజిస్ట్రేషన్ పీరియడ్ మార్చి 6 నుంచి 22 వరకు కొనసాగనుంది. ఈలోగా రిజిస్ట్రేషన్, దరఖాస్తు రుసుము చెల్లింపుల కోసం USCIS ఆన్లైన్ అకౌంట్ను వినియోగించాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 28 నుంచి కంపెనీలు తమ ఖాతాలను తెరుచుకునేందుకు అనుమతి ఇవ్వనున్నాయి. ఫామ్ ఐ-129, నాన్- క్యాప్ హెచ్-1బీ పిటిషన్ల కోసం ఫామ్ ఐ-907 పత్రాలను ఆన్లైన్లో సమర్పించాల్సి ఉంటుందని USCIS పేర్కొంది.
అయితే, వృత్తి నిపుణులకు ప్రతి ఏడాది పరిమిత సంఖ్యలో హెచ్-1బీ వీసాలను జారీ చేస్తుంటారు. ఇందుకోసం ఏటా 65 వేల వీసాలతో పాటు మాస్టర్స్ డిగ్రీ చేసే వారి కోసం మరో 20వేల వీసాలను మంజూరు చేస్తారు. నాన్ ఇమిగ్రేషన్ హెచ్-1బీ వీసాలను పొందేవారిలో ఎక్కువమంది భారతీయులే ఉండటం గమనార్హం. ఈ నాన్- ఇమిగ్రేషన్ వీసాలు అనేవి అమెరికాలో కొంతకాలం ఉండాలనుకునేవారికి ఇస్తారు. వీటిని కంప్యూటరైడ్జ్ లాటరీ విధానంలో ఎంపిక చేసి కేటాయిస్తారు.
కాగా, గత కొంత కాలంగా కంప్యూటరైడ్జ్ లాటర్ సిస్టంను దుర్వినియోగ పరుస్తున్నారనే విషయం అమెరికా దృష్టికి వచ్చింది. కొన్ని కంపెనీలు తమ విదేశీ ఉద్యోగులకు వీసాలు దక్కే అవకాశాలను పెంచుకునేందుకు ఈ లాటరీ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నట్లుగా గుర్తించింది. దీంతో హెచ్-1 వీసాల రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ఆధునీకరించేందుకు అమెరికా ఫెడరల్ ఏజెన్సీ చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే కొత్త వీసా నిబంధనలను తీసుకురావడం గమనార్హం.
-
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బంగారం ధరలు -
తెలంగాణ దశను మార్చే బిగ్గెస్ట్ రైల్వే ప్రాజెక్ట్ -
Sunrisers: సన్ రైజర్స్ ను ఆదుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ..! విమర్శల వేళ..! -
పెట్రోల్, డీజిల్ రేట్లపై కేంద్రం రివ్యూ?












Click it and Unblock the Notifications