ఇమ్రాన్ ఖాన్పై దాడి, అడ్డుకున్న వ్యక్తికి ప్రశంసలు.. అభిమానుల ఫిదా
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్పై హత్యా ప్రయత్నం జరిగిన సంగతి తెలిసిందే. గురువారం వజీరాబాద్లో జరిగిన ర్యాలీలో దుండగుడు కాల్పులు జరపడంతో.. ఇమ్రాన్ కాలికి గాయమైంది. అయితే ఇమ్రాన్ ఖాన్పై కాల్పులు జరిపిన సమయంలో పట్టుకున్న వ్యక్తిని ఇమ్రాన్ మద్దతుదారులు అభినందించారు.
అతనిని వారు తమ భుజంపైకి ఎక్కించుకున్నారు. అభినందనలు తెలుపుతూ.. ముద్దు పెట్టుకున్నారు. ఆ దుండుగుడిని పట్టుకొని మంచి పనిచేశావు అని అన్నారు. అతను కాల్పులు జరపడం తాను చూశానని.. మరో రౌండ్ కాల్పులు చేయకుండా చూశానని తెలిపారు. ఆ వెంటనే అతను తుపాకీ వదిలేసి పారిపోయాడని.. అతనిని తాను పట్టుకున్నానని వివరించారు. అంతేకాదు.. తాను బతికున్నంత కాలం.. ఖాన్ సార్కి ఏమీ కానీవ్వను అని కామెంట్ చేశారు.

ఘటనను పాకిస్థాన్ ప్రధాని షెహబాబ్ షరీఫ్ ఖండించారు. పాక్లో గల పంజాబ్ ఐజీ, సీఎస్ నుంచి నివేదిక కోరాలని ఇంటిరియర్ మినిస్టర్ రాణా సానాల్హాహ్ను ఆదేశించానని తెలిపారు. అక్టోబర్ 29వ తేదీ నుంచి లాహోర్ నుంచి ఇస్లామాబాద్ వరకు ఇమ్రాన్ ఖాన్ ర్యాలీ తీస్తున్నారు. పాకిస్తాన్ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ ర్యాలీ కొనసాగింది. నవంబర్ 4వ తేదీన (రేపు) ర్యాలీ ఇస్లామాబాద్ చేరుకోవాల్సి ఉంది. ఇంతలోనే దాడి జరిగింది.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications