చైనా సరిహద్దుల్లో ఆర్మీ మోహరింపు, ఎందుకంటే?
కిబిథు: చైనా సరిహద్దుతో పాటు అరుణాచల్ప్రదేశ్ సెక్టార్లోని పలు ప్రాంతాల్లో భారత్ తన బలగాల సంఖ్యను మరింత పెంచింది. చైనా సరిహద్దు వెంట దిబాంగ్, డియో- డిలాయ్, లోహిత్ తదితర ప్రాంతాల్లో ఆర్మీ పహరా సాగుతోంది.
ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి ప్రకటించిన తర్వాత చైనా సరిహద్దుల్లో ఆర్మీని మోహరించడం ప్రాధాన్యతను సంతరించుకొంది.
ప్రస్తుతమున్న ఆర్మీకి తోడుగా అదనపు సిబ్బంది చైనా సరిహద్దులకు తరలిస్తున్నారు. డోక్లామ్ వద్ద కూడ భారత్ తన బలగాలను పెంచింది. డోక్లామ్కు అవతలివైపున చైనా సరిహద్దులో ఆ దేశం భారీగా నిర్మాణాలను చేపడుతోంది అయితే భారత్ లో కూడ ఆర్మీని గతంలో కంటె ఎక్కువగా మోహరించింది.
వాస్తవాధీన రేఖ వద్ద లాంగ్ రేంజ్ పెట్రోలింగ్ ను 15 నుండి 30 రోజుల పాటు నిర్వహిస్తున్నారు. ఎప్పటికప్పుడు సరిహద్దులో నెలకొన్న పరిస్థితులను సమీక్షిస్తున్నారు అధికారులు. అంతేకాదు భారత్, చైనా , మయన్మార్ ట్రై జంక్షన్తో పాటు ముఖ్యమైన ప్రాంతాల్లో బలగాలను విస్తరించినట్టు ఆర్మీ అదికారులు ప్రకటించారు. కిబిథు ప్రాంతానికి ఆర్మీకి అవసరమైన సామాగ్రిని తరలించేందుకు తాత్కాలికంగా వంతెనను నిర్మించారు.